amp pages | Sakshi

సీపీఎస్‌ అంతం.. ఉద్యోగుల పంతం

Published on Sun, 02/12/2017 - 00:11

- కాకినాడలో కదం తొక్కిన ఉద్యోగులు
- భారీ ప్రదర్శన, బహిరంగ సభ
- సంఘటిత ఉద్యమం ఉద్ధృతానికి నేతల పిలుపు
కాకినాడ సిటీ : కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌)ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు కాకినాడలో శనివారం కదం తొక్కారు. ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన జిల్లా నలుమూలల నుంచీ వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున కాకినాడ తరలివచ్చి మహాశాంతి ర్యాలీ నిర్వహించారు. తొలుత బాలాత్రిపురసుందరి అమ్మవారి ఆలయం నుంచి మెయిన్‌రోడ్, బాలాజీచెరువు సెంటర్, జీజీహెచ్, కలెక్టరేట్, రామారావుపేట మీదుగా మెక్లారిన్‌ స్కూల్‌ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ‘సీపీఎస్‌ అంతం - ఉద్యోగుల పంతం, ఒకే సర్వీసుకు ఒకే పెన్షన్‌ ఉండాలి’ అంటూ పెద్ద పెట్టున నినదించారు. సీపీఎస్‌ విధానంవల్ల ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక హక్కులైన పెన్షన్, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ వంటి సదుపాయాలను కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక భద్రత లేని సీపీఎస్‌ విధానం రద్దు చేసేలా నిర్ణీత కాలపరిమితితో కూడిన కమిటీ వేయాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న డెత్‌ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ సదుపాయం తమకు కూడా కల్పించాలని, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను తక్షణం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.
ర్యాలీ అనంతరం మెక్లారిన్‌ హైస్కూల్‌ ఆవరణలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొలుత ఇటీవల మృతి చెందిన సీపీఎస్‌ ఉద్యోగులకు నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ యుగంధర్‌ మాట్లాడుతూ, 2004 జనవరి ఒకటి నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేస్తూ, 2004కు ముందు, తరువాత అంటూ ఉద్యోగులను ప్రభుత్వం విభజించి గోడ నిర్మించిందన్నారు. ఆ గోడను బద్దలుగొట్టేందుకు ఉద్యోగులు మరింత సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని సాధించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, సీపీఎస్, ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎస్‌) అనే తేడా లేకుండా ఉద్యోగులందరూ ఉద్యమిస్తే పాలకులు దిగి వస్తారని అన్నారు.
ఉద్యమ కార్యాచరణ
జిల్లాలో ఉద్యమ కార్యాచరణను సీపీఎస్‌ ఉద్యోగుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతా నారాయణమూర్తి ప్రకటించారు. సంఘ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 28న రక్తదాన శిబిరాలు, జూన్‌లో వారం రోజులు బ్లాక్‌డే పాటించాలని, జూలై మొదటి వారంలో ఉద్యోగులు వారి కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టాలని, ఆగస్ట్‌ 9న క్విట్‌ ఉద్యమం, సెప్టెంబర్‌ ఒకటిన చలో అమరావతి చేపట్టాలని వివరించారు. అలాగే తునిలో భిక్షాటన, అమలాపురంలో భారీ బైక్‌ ర్యాలీ, రాజమహేంద్రవరంలో సత్యాగ్రహ యాత్ర చేపట్టాలని నిర్ణయించామని, వీటి తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. సంఘ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు కె.మునిప్రసాద్, గుబ్బల శ్రీనివాస్, ఖాజా రహ్మతుల్లా, జిల్లా గౌరవాధ్యక్షులు తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌, జిల్లా నాయకులు కె.వెంకటేష్, కె.రత్నాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Videos

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)