జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'అభివృద్ధి కోరుకుంటే పోటీ నుంచి తప్పుకోండి'
Published on Wed, 12/09/2015 - 17:46
కరీంనగర్: తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన విపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటే ఆయా పార్టీల అభ్యర్ధులు పోటీ నుంచి తప్పుకోవాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. టీఆర్ఎస్ అభ్యర్ధుల ఏకగ్రీవం కావడానికి అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మొత్తం 12 స్థానాలకు గాను అధికార పార్టీ టీఆర్ఎస్ అన్నింటికీ నామినేషన్లు వేసింది. కాంగ్రెస్ 5 చోట్ల మాత్రమే బరిలో నిలిచింది. టీడీపీదీ ప్రస్తుతం అదే పరిస్థితి. బీజేపీ అసలు ఈ ఎన్నికల బరిలోనే లేకపోవడం గమనార్హం. 12వ తేదీ నామినేషన్లకు ఉపసంహరణకు చివరితేదీ కాగా, 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీటికి పోలింగ్ నిర్వహిస్తారు. 30వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
#
Tags