నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైల్వేస్టేషన్లో చెత్తవేస్తే జరిమానా
Published on Fri, 09/23/2016 - 01:54
- సీఎంఎం సత్యనారాయణ
నెల్లూరు(సెంట్రల్) : రైల్వేస్టేషన్లో ప్రయాణికులు నిబంధనలకు విరుద్ధంగా చెత్త వేస్తే రూ.500 వరకు జరిమానా విధిస్తామని సికింద్రాబాద్ డివిజన్ చీఫ్ మెటీరియల్ మేనేజర్ (సీఎంఎం) సత్యనారాయణ అన్నారు. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లో గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వారంరోజుల పాటు దేశంలోని అన్ని రైల్వేస్టేషన్లలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రయాణికులకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత కూడా ఎవరైనా స్టేషన్లో చెత్త వేస్తే జరిమానా వేస్తామని చెప్పారు. అంతకుముందు స్వచ్ఛ నాటిక ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ టికెట్ మేనేజర్ సాగర్, రమేష్, మునీర్, నాయక్, ఇన్చార్జి ఎస్ఎస్ కుమార్ పాల్గొన్నారు.
#
Tags