amp pages | Sakshi

‘ఎకో’దంతుడే బెస్ట్‌

Published on Wed, 08/24/2016 - 22:07

►   సమీపిస్తున్న గణేష ఉత్సవాలు
►   వినాయకుడి విగ్రహాల తయారీలో హానికారక రంగుల వినియోగం
►   రసాయన మిశ్రిత విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు
►   నిమజ్జనం తరువాత చెరువుల్లో కరగని వ్యర్థాలు
►   ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటున్న పర్యావరణవేత్తలు

విఘ్నాలన్నింటినీ తొలగించే వినాయకుడు, గణాలన్నింటికీ అధినాయకుడైన గణనాథుడు ప్రజలందరీ చేత పూజలందుకోవడానికి మరికొద్ది రోజుల్లో వాడవాడలా కొలువుదీరనున్నాడు.  అయితే వినాయక విగ్రహాల తయారీలో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ను వాడడంతో పాటు అనేక రసాయన రంగులను ఉపయోగిస్తుండటంతో నిమజ్జనం తరువాత చెరువులు, కుంటలు కరగని వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఈ పరిణామం పర్యావరణానికి ఎంతో హానికలిగించడమే కాదు, జలసంపదపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే పర్యావరణానికి ఏ మాత్రం హానికలిగించని ‘ఎకో’దంతుని పూజించాలంటూ పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.


వినాయక విగ్రహాల అలంకరణ కోసం ప్లాస్టిక్‌తో తయారైన పూలు, థర్మోకోల్‌ ఉత్పత్తులను ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఉత్సవాలు ఆఖరున విగ్రహాలతో పాటు అలంకరించిన సామగ్రి కూడా నిమజ్జనం చేస్తున్నారు. దీంతో ప్లాస్టిక్, థర్మోకోల్‌ పదార్ధాలన్నీ అలాగే ఉండిపోతున్నాయి. వీటి బదులు సహజ సిద్ధమైన పూలు, మామిడి, నిమ్మ ఆకులు, పసుపు, చందనం, కుంకుమ, గరికలతో అలంకరించడం వల్ల పర్యావరణానికి ఏ మాత్రం హాని జరగకపోగా పండుగను మరింత సంప్రదాయ బద్ధంగా నిర్వహించడానికి కూడా వీలవుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

వీటి వినియోగం ప్రమాదమే
వినాయకుని విగ్రహానికి వేసే రంగుల్లో సిలికాన్‌పొడి, జింక్‌ పొడి, చాక్‌పీస్‌ పొడి, గాజు పొడి కలుపుతారు. ఇవి నీటిలో, భూమిలో కలిస్తే మానవళికి ప్రమాదం. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌ ఏళ్లు గడిచినా భూమిలో కలవదు. రంగుల కోసం మెర్క్యూరీ సల్ఫేట్, పొటాషియం, డ్రైక్రోమిట్,క్రోమియం, అయోడైడ్,  లెడ్‌ఆక్సైడ్, కాడ్మియం, నికెల్‌ వాడకం వల్ల  అలర్జీ, ఉబ్బసం, న్యూమోనియా, చర్మ వ్యాధులు, గ్రహణశక్తి తగ్గడం, కిడ్నీ ఇన్‌ఫెక్షన్, పిల్లల్లో శారీరక, మానసిక ప్రవర్తనలలో మార్పులు, ఎముకల బలహీనత సంభవించవచ్చు. భారీ శబ్ధతరంగాలను వెలువరించే సౌండ్‌ సిస్టమ్‌ కాకుండా మంద్ర స్థాయిలో ఏర్పాటు చేయడం వల్ల శబ్ధ కాలుష్యాన్ని నివారించుకోవచ్చు.

మార్గదర్శకాల అమలులో ఉదాసీనత
కాలుష్యాన్ని నివారించేందుకు 2010లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. సమాజ హితానికి పనికొచ్చే ఈ మార్గదర్శకాల అమలును కాలుష్య నియంత్రణ శాఖ, మున్సిపాలిటీ/పంచాయతీ, మత్స్యశాఖ, నీటి పారుదల శాఖలు విస్మరించాయి. దీంతో వినాయకచవితి వేడుకలు పర్యావరణకు ముప్పు వాటిల్లేలా మారాయి. ప్రతి ఏటా జిల్లాలో 20వేల నుంచి 25వేల వినాయక విగ్రహాలు, ప్రతిమలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 98శాతం ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌తో తయారు చేసినవే కావడం గమనార్హం. వీటిని చెరువులు, కాలువలలో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం పెరిగిపోతోంది. మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారుతోంది.

మట్టి వినాయకులే మేలు
మట్టికి సులువుగా కరిగే గుణం ఉంటుంది. విగ్రహాల తయారీలో చెరువు మట్టి వినియోగంతో పూడిక సమస్యలు తొలుగుతాయి. అందుకే మట్టికి ప్రాధాన్యం ఇచ్చేవారు. వినాయక చవితినాడు 18 రకాల ప్రతులతో మట్టి విగ్రహాన్ని పూజించేవారు. ఆధునిక వైద్యం అందుబాటులో లేని రోజుల్లో వర్షాకాలంలో వరదల తరువాత జరిగే నీటి కాలుష్యాన్ని నివారించేందుకు ఈ 18 రకాల పత్రులతో మట్టి విగ్రహాన్ని పూజించి, వాటిని తెల్లారే నదిలో నిమజ్జనం చేసేవారు. ఈ ప్రతులను ఎందుకు వాడాలంటే ఇవి నీటిని శుభ్రపరచడంలో ఆరితేరినవి. ఆనాడు తాగే నీటిని శుభ్రపరచడంతోపాటు చవితి జరుపుకునేవారు. నిజానికి వినాయక చవితి పర్యావరణానికి పూర్తిగా మేలు చేసే పండుగ. వీటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహణ ఎంతో అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రాణికోటికి ముప్పు
ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌తో తయారు చేసే విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల ప్రాణికోటి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.  విగ్రహాలకు వాడే రంగుల్లో హానికరమైన రసాయనాలున్నాయి. దీని వల్ల ఆ నీటిని వినియోగిస్తే చర్మవ్యాధులు సంభవిస్తాయి. మట్టి విగ్రహాలయితే ఎలాంటి హానీ ఉండదు. సహజ రంగులు వాడితే ప్రమాదం ఉండదు. గణపతి వద్ద ఉంచే వివిధ రకాల ఆకుల వల్ల నీటి శుద్ధి జరుగుతుంది. పర్యావరణం దెబ్బతినదు.
– డాక్టర్‌ పద్మావతి, దేవి నర్సింగ్‌హోమ్, ధర్మవరం

Videos

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)