amp pages | Sakshi

‘రేషన్‌’లో కిరాణం!

Published on Sun, 09/25/2016 - 23:28

చౌక ధరల దుకాణాల్లో పీడీఎస్‌ సరుకులతో పాటు ఇతర సరుకుల విక్రయం
డీలర్లకు ప్రభుత్వ కమీషన్‌ చాలనందున ప్రత్యామ్నాయం
పౌరసరఫరాల మంత్రి వద్ద దస్త్రం
త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు

చౌక ధరల దుకాణాలు త్వరలో కిరాణాషాపులుగా మారనున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే సరుకులతో పాటు సాధారణ సరుకులు కూడా ఇకపై అక్కడే లభించనున్నాయి. పీడీఎస్‌ సరుకులతో పాటు ఇతర వస్తువులు సైతం విక్రయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన దస్త్రం పౌరసరఫరాల శాఖ మంత్రి వద్ద పెండింగ్‌లో ఉంది. మరో పక్షం రోజుల్లో దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 1,952 చౌకధరల దుకాణాలున్నాయి. ఇందులో 711 మహిళల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పీడీఎస్‌ సరుకుల సంఖ్యను కుదించింది. ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పండగ సందర్భాల్లో అరుదుగా చక్కెర ఇస్తున్నారు. ఇక నూనెలు, పప్పు, గోధుమల స్టాకు జాడలేకుండా పోయింది. ఈ క్రమంలో డీలర్లకు ఆదాయం భారీగా తగ్గిందని పౌరసరఫరాల శాఖపై ఒత్తిడి మొదలైంది. ఇటీవల రాష్ట్రస్థాయి సమావేశంలో డీలర్లు ఈ అంశాన్ని స్పష్టం చేయడంతో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే అలోచనలో ప్రభుత్వం తలమునకలైంది. ఈ క్రమంలో ఇతర సరుకుల అమ్మకాలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని భావిస్తోంది. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ నివేదిక సమర్పించి ప్రభుత్వానికి అందించింది.

సాధారణ ధరకే సరుకులు...
ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో పీడీఎస్‌ సరుకులను చౌక ధరకు అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన రాయితీని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ సరుకుల అమ్మకంపై డీలర్లకు నిర్ధిష్ట మొత్తంలో కమీషన్‌ ఇస్తుంది. అయితే సరుకుల సంఖ్య తగ్గడంతో డీలర్లకు ఆదాయం భారీగా తగ్గింది. దీంతో ఇతర సరుకులు విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని డీలర్ల సంఘం డిమాండ్‌ చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు యోచిస్తోంది. అయితే పీడీఎస్‌ సరుకులు మినహా ఇతర సరుకులు మార్కెట్‌ ధరకే అమ్ముకునే అవకాశం ఇవ్వనుంది. అయితే, ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.

Videos

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)