చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
Published on Fri, 09/09/2016 - 18:34
నల్లగొండ టౌన్ : జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండేళ్లుగా జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం ఎలాంటి కరువు నివారణ చర్యలు చేపట్టడంలేదని విమర్శించారు. రైతుల పంట రుణాలను రీషెడ్యూల్ చేసి పంట రుణాలను ఏక కాలంలో ఇప్పించాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు, మండలాల విషయంలో ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు జిల్లాలో వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పి.అనంతరామశర్మ, తిరందాసు గోపి, రాములు, మల్లు లక్ష్మి, నర్సింహ, బి.శ్రీశైలం, ఎం.సుధాకర్రెడ్డి, పి.నర్సింహ, తదితరులున్నారు.
#
Tags