రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
Published on Wed, 05/18/2016 - 18:07
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు ఆగ్నేయంగా 140 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. రానున్న 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని సూచించింది. రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు, తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
అయితే నెల్లూరు తీరంలో ఈదురుగాలులు వేగంగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, సూళ్లురుపేట, కావలిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
#
Tags