అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘ ఎస్ఆర్కేఆర్’లో ఐ హబ్
Published on Wed, 11/16/2016 - 22:52
భీమవరం: ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధన, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన్నాన్ని అందిపుచ్చుకునేందుకు తమ కళాశాలలో రూ.10 కోట్ల వ్యయంతో ఐ హబ్ను ఏర్పాటు చేసినట్టు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు సాగి ప్రసాద్రాజు అన్నారు. బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన ఐ హబ్ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుమారు 500 మంది విద్యార్థులు ఒకే సమయంలో నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఐ హబ్ దోహదపడుతుందన్నారు. ఇంటర్నెట్, మొబైల్ వైఫై సౌకర్యంతోపాటు విద్యార్థులు నూతన ఉత్పత్తులు తయారు చేయడానికి సహకారం అందించేందుకు బ్యాంకులు, సాఫ్ట్వేర్ సంస్థలు, క్యాంటిన్వంటి అన్ని సదుపాయాలు హబ్లో అందుబాటులో ఉంటాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారథివర్మ మాట్లాడారు. అనంతరం కళాశాలలో రూ.15 కోట్లతో నిర్మించనున్న బాలికల హాస్టల్ భవనానికి అధ్యక్షుడు ప్రసాద్రాజు శంకుస్థాపన చేశారు. కళాశాల చైర్మన్ గోకరాజు మురళీరంగరాజు, డైరెక్టర్ ఎస్వీరంగరాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
#
Tags