మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మోదీతో పోరాడలేకే దోమలతో కుస్తీ
Published on Sun, 09/25/2016 - 23:44
కొల్లాగుంట(కార్వేటినగరం) : రాష్ట్ర అభివృద్ధికి సంజీవని అయిన ప్రత్యేక హోదాపై మోదీతో పోరాడలేక చంద్రబాబు దోమలతో కుస్తీపడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి అన్నారు. కొల్లాగుంటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీతో పోరాడి ప్రత్యేక హోదా సాధించలేక ప్రజలను మభ్యపెట్టేందుకు దోమలను చూపుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీపై ఆసక్తి చూపుతున్నారు తప్ప రాష్ట్రాభివృద్ధికికాదని విమర్శించారు. రైతులు పంటల సాగుకు బ్యాంకులపై ఎక్కువ శాతం మంది ఆధారపడుతుంటారు వారికి రుణాలుఇవ్వకుండా చంద్రబాబు ఆంక్షలు వి«ధించి రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రుణాలను మాఫీచేస్తానని చెప్పి నమ్మి ఓట్లు వేసిన రైతులను పూర్తిగా ముంచేసిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. బంగారు ఆభరణాలపై రుణాలు ఇవ్వకపోతే కౌలురైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. పంటల సాగుకు రైతులు ప్రయివేటు రుణాలు అధిక వడ్డీలకు తెచ్చుకోవాల్సి వస్తోందని చెప్పారు. అనంతరం కొల్లాగుంట దళితవాడలో దోమల నివారణకు చేపడుతున్న ఫాగింగ్«ను పరిశీలించారు.
#
Tags