ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐఎన్టీయూసీని ఆదరించాలి
Published on Mon, 07/25/2016 - 17:52
- వర్కింగ్ ప్రెసిడెంట్ బి వెంకట్రావు
- ఆర్కే 5గనిపై గేట్ మీటింగ్
శ్రీరాంపూర్ : వచ్చే ఎన్నికల్లో కార్మికులు ఐఎన్టీయూసీని ఆదరించాలని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు తెలిపారు. సోమవారం ఆయన ఆర్కే 5 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో కార్మికులనుద్దేశించి మాట్లాడారు. తాము గుర్తింపు సంఘంగా ఉన్న హయాంలోనే కార్మికులకు 40 హక్కులు సాధించామని అన్నారు. ఆ తర్వాత గెలిచిన సంఘాలన్నీ కార్మికుల హక్కులు కాలరాస్తున్నాయని విమర్శించారు. టీబీజీకేఎస్ పూర్తిగా విఫలమైందని, వారి అసమర్థత వల్ల నేడు ప్రైవేటీకరణ పెరిగిందని పేర్కొన్నారు. గనులు కూడా ప్రైవేటు పరం కాబోతున్నాయని ఆరోపించారు.
9వ వేజ్బోర్డులో కార్మికులకు మెరుగైన జీతాలు అందించడానికి జాతీయ సంఘాలు కృషి చేశాయని, 10వ వేజ్బోర్డులో కూడా మెరుగైన వేతనాల కోసం కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని తెలిపారు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, సకల జనుల సమ్మె వేతనాలు చెల్లించాలని, స్వంతింటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం అవసరమైతే అన్ని సంఘాలను కలుపుకొని సమ్మె చేస్తామని తెలిపారు.
సమావేశంలో యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు డి.అన్నయ్య, బ్రాంచి ఉపాధ్యక్షులు జి.మహిపాల్రెడ్డి, అద్దు శ్రీనివాస్, అశోక్, బోనగిరి కిషన్, ఫిట్ సెక్రెటరీ ఆనందం, నాయకులు గంగయ్య, రమేశ్, శ్రీనివాస్రావు పాల్గొన్నారు.
#
Tags