amp pages | Sakshi

వికలాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలి

Published on Sun, 12/04/2016 - 01:54

రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
జిల్లా పరిషత్‌లో అంతర్జాతీయ     వికలాంగుల దినోత్సవం

ఆదిలాబాద్ అర్బన్ : వికలాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో అంగవైకల్యం కలిగి ఉన్న 33,722 మంది అభ్యర్థులకు గతంలో ఉన్న పింఛన్లను అధిక మొత్తంలో పెంచారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.34 లక్షల మందికి పింఛన్ అందజేస్తున్నామని అన్నారు. జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమ అధికారి ఉమాదేవి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 13,644 అంధులు, 5,336 మంది చెవిటి, మూగ, 10,615 మంది శారీరక, 4,127 మంది మానసిక వికలాంగులు కలిపి మొత్తం 33,722 మంది ఉన్నారని తెలిపారు.

అన్ని రకాల స్కాలర్‌షిప్‌లు, వివాహ ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా 50 శాతం సబ్సిడీపై రూ.లక్ష వరకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నామని, అన్ని సౌకర్యాలు ఉన్న శారీరక వికలాంగులకు పెట్రోల్‌పై రారుుతీ కూడా అందజేస్తున్నామని అన్నారు. వికలాంగులకు ప్రభుత్వ శాఖల్లో మూడు శాతం రిజర్వేషన్‌పై నియామకం చేపడుతున్నామని, మూడు చక్రాల బండ్లు, సంక కర్రలు, బ్రెరుులీ పలక, ఎంపీ3 ప్లేయర్లు, ట్యాప్‌టాప్‌లు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. వికలాంగులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించారుు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో జితేందర్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌రాథోడ్, మహిళా సంక్షేమ అధికారి ఉమాదేవి, వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)