నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గారడీ చేస్తున్న కేసీఆర్
Published on Mon, 09/12/2016 - 00:05
- పీఓడబ్ల్యూ జాతీయ కౌన్సిలర్ సంధ్య
తిరుమలాయపాలెం: ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హమీలను విస్మరించి మాయమాటలు చెప్పి కాలం గడుపుతున్నారని పీఓడబ్ల్యూ జాతీయ కౌన్సిలర్ సంధ్య అన్నారు. పార్టీ నాయకులు అన్నం శ్రీనివాసరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం స్థూపాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో అధికారం కోసం అనేక హమీలు ఇచ్చి నేడు తుంగలో తొక్కారన్నారు. దళితులకు మూడు ఎకరాలు భూమి ఏమైందని ప్రశించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల ఊసే ఎత్తటం లేదన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ ప్రజా సమస్యల వైఫల్యాలపై క్షేత్ర స్థాయిలో ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం పని చేసిన అన్నం శ్రీనివాసరెడ్డి ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమెక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్ధన్, ఎం.శ్రీనివాస్, కోలేటి నాగేశ్వరరావు, నిర్మలా, తిమ్మడి సైదయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags