amp pages | Sakshi

మహారాష్ట్రకు ఖేడ్ రైతులు

Published on Thu, 06/23/2016 - 01:56

ఉల్లి సాగుపై త్వరలో అధ్యయనం రూ.400 కోట్లతో డ్రిప్పు
ఎక్కడా లేని సబ్సిడీ మన దగ్గరే..
ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి

 నారాయణఖేడ్: రాష్ట్రంలో ఉల్లిసాగును లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మండల పరిషత్ కార్యాలయ  సమావేశ మందిరంలో బుధవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉల్లిసాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహారాష్ట్రలో ఉల్లి రైతులు ఆర్థికంగా ఎలా ఎదుగుతున్నారో అధ్యయనం చేసేందుకు ఈ ప్రాంత రైతులను రెండు బస్సుల్లో తీసుకెళ్తామన్నారు. అధ్యయనం తరువాత గిడ్డంగుల నిర్మాణం తదితర అంశాలపై దృష్టి సారిస్తామన్నారు.

 ఎక్కడా లేనివిధంగా సబ్సిడీ...
బిందు, తుంపర సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించిందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధం గా రాష్ట్రంలో స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ పైపులను సబ్సిడీ రూపంలో రైతులకు అందజేస్తున్నామని చెప్పారు. ఉద్యాన, పట్టు పరిశ్రమ, సూక్ష్మ సాగు కోసం పలు పథకాల అమలుకు మండల స్థాయిలో అధికారులను నియమించి నట్టు తెలిపారు. ఉల్లి రైతుల కోసం రూ.200 కోట్లతో పాలీహౌస్‌లు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ఎకరాలోపు దాదాపు 100 నుంచి 120 క్వింటాళ్ల ఉల్లిని పండించేలా కృషి చేయాలన్నారు. అధునాతన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి సేంద్రి య పద్ధతిలో పంటలను సాగుచేస్తే అధిక దిగుబడులు సాధ్యమన్నారు. ఉల్లితోపాటు కూరగాయలూ సాగుచేసుకోవాలని సూచించారు.

 ఖేడ్‌ను సస్యశ్యామలం చేస్తాం: ఎమ్మెల్యే
ఖేడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అన్నారు. గోదావరి నీటిని ఈ ప్రాంత ప్రజలకు అందించి పంటలు బాగా పండేలా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. నియోజకవర్గంలో భూగర్భ జలాలు తక్కువగా ఉన్నందున బిందు, తుంపర సేద్యంపై గ్రామీణ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. ఉల్లి గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ రామలక్ష్మి మాట్లాడుతూ... రైతులు స్ప్రింక్లర్లు, డ్రిప్ ఉపయోగించి ఆరుతడి పంటలు సాగు  ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ సంజీవరెడ్డి, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డెరైక్టర్లు సోమేశ్వర్‌రావు, లత, ఆత్మ చైర్మన్ భాస్కర్, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌