నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యువతిపై కత్తితో దాడి
Published on Sun, 04/16/2017 - 23:45
పశివేదల (కొవ్వూరు రూరల్): పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో యువతిపై ఓ వ్యక్తి పాశవికంగా దాడి చేశాడు. అడ్డుకోవడానికి వెళ్లిన తల్లిదండ్రులు, స్థానికులపై కూడా దాడికి దిగడంతో అతడికి దేహశుద్ధి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కొవ్వూరు మండలం పశివేదలకు చెందిన మావూరి సూరిబాబుకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఆఖరి కుమార్తె సరస్వతి రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. రోజూ విధులకు రాజమండ్రి వెళ్లి వస్తుండగా మూడేళ్ల నుంచి కార్ డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్న చాగల్లు మండలం గౌరిపలి్లకి చెందిన వరసాల రవిప్రకాష్ ఆమెను పెళ్లి చేసుకోమని వేధించ సాగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో గతేడాది డిసెంబర్ 15న ఆమె కొవ్వూరు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రవిప్రకాష్ను మందలించి వదిలివేశారు. అయినా వేధింపులు మానలేదు. ఆదివారం ఈస్టర్ సందర్భంగా చర్చికి వెళుతున్న సరస్వపై ఆమె ఇంటి సమీపంలోనే రవిప్రకాష్ దాడికి పాల్పడ్డాడు.
సరస్వతి కేకలు వేయడంతో ఆమె తల్లిదండ్రులతో పాటు స్థానిక యువకులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిపై కూడా దాడికి దిగాడు. వారంతా కలిసి రవిప్రకాష్కు దేహశుద్ధి చేశారు. బాధితురాలు సరస్వతి కొవ్వూరు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ ఏకే సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags