ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేటి నుంచి ఎల్ఐసీ జోనల్∙క్యారమ్స్ అండ్ చెస్ టోర్నీ
Published on Sun, 08/28/2016 - 22:04
ఆల్కాట్తోట(రాజమహేంద్రవరం): ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్ అండ్ చెస్ టోర్నమెంట్ స్థానిక జేఎన్రోడ్లోని సూర్యగార్డెన్స్లో సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరం డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ జె.రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ రీజనల్ మేనేజర్ (హెచ్ఆర్డీ) కేవీపీవీ నరసింహారావు ఈ టోర్నమెంటును ప్రారంభిస్తారు. ఈ పోటీల్లో ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలనుంచి సుమారు 70 మంది క్రీడాకారులు పాల్గొంటారని రంగారావు తెలిపారు. రాజమహేంద్రవరం ఎల్ఐసీ మెయిన్ బ్రాంచి కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆటగాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో రాజమహేంద్రవరం ఎల్ఐసీ రాజమహేంద్రవరం డివిజనల్ కార్యాలయ మేనేజర్ (పీఆర్) నాగేంద్రకుమార్, ఎన్బీ మేనేజర్ అహ్మద్ ఆలీషా, చెస్ ఆర్బెటర్ జీవీ కుమార్, క్యారమ్స్ ఆర్బెటర్ అస్మదుల్లా, స్పోర్ట్సు ప్రమోషన్బోర్డు సభ్యులు జాన్సన్, మంజునాథ్ నియమనిబంధనలను వివరించారు.
#
Tags