నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లోక్ అదాలత్లో అంతిమతీర్పు
Published on Sat, 04/08/2017 - 19:35
ఏలూరు (సెంట్రల్) : అప్పీలు లేని, న్యాయబద్ధమైన అంతిమ తీర్పు పొందేందుకు లోక్అదాలత్ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సునీత అన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరకాలంగా కోర్టుల్లో అపరిష్కృతంగా నిలిచిపోయిన 2,700 పెండింగ్ కేసులు శనివారం జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించటం జరుగుతుందన్నారు. జిల్లాలోని 10 కోర్టుల్లో 22 బెంచీలు ఏర్పాటు చేశామని, జిల్లా కోర్టులో 4 బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ మహిళ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద రూ. 4 లక్షల చెక్కును జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత చేతులమీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కె.సాయిరమాదేవి, రమాదేవి, కె.సునీత, ఎస్.శ్రీదేవి, ఎల్.శ్రీధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్బినేని విజయ్కుమార్ పాల్గొన్నారు.
#
Tags