అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఒక్కటైన ప్రేమజంట
Published on Wed, 06/07/2017 - 22:54
తనకల్లు (కదిరి) : అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్తికోటకు చెందిన మణిమాల, కర్నూలు జిల్లా నంద్యాల మండలం ఎర్రగుంట్లకు చెందిన ప్రసన్నకుమార్ ప్రేమకథ సుఖాంతమైంది. వీరిద్దరూ కలసి ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాలుగేళ్ల కిందట ఇంజినీరింగ్ చదివేవారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. చదువు పూర్తయ్యాక తమ ప్రేమ విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలిపారు. పెళ్లి చేసి ఆశీర్వదించాలని కోరారు. కులాలు వేరైనా అబ్బాయి తరఫు వారు సుముఖత చూపగా, అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. ఇద్దరూ మేజర్లు కావడంతో తనకల్లు మండలం తవళం ఆంజనేయస్వామి దేవస్థానంలో వారిద్దరూ దండలు మార్చుకొని బుధవారం ఒక్కటయ్యారు. వధూవరులను ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రమణ, ఇతర పెద్ద మనుషులు ఆశీర్వదించారు.
#
Tags