రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
23 మంది విద్యార్థులపై మాల్ప్రాక్టీస్ కేసులు
Published on Sat, 03/25/2017 - 23:54
కర్నూలు(ఆర్యూ): శనివారం జరిగిన రెండో సెమిస్టర్ డిగ్రీ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా మాస్ కాపీయింగ్కు పాల్పడిన 23 విద్యార్థులపై మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. నందికొట్కూరు వైష్ణవి కళాశాలలో ఇద్దరు, కర్నూలు డిగ్రీ కళాశాల సెంటర్లో ఒకరు, కోవెలకుంట్ల ఎస్.వి డిగ్రీ కళాశాల సెంటర్లో ముగ్గురు, ఎమ్మిగనూరు రావూస్ కళాశాల సెంటర్లో ఇద్దరు, వైష్ణవి డిగ్రీ కళాశాల సెంటర్లో ఒకరు, కోడుమూరు సాయిరాం సెంటర్లో 14 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో రెండు రోజులుగా మొత్తం 31 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విద్యార్థుల పరీక్ష పేపర్లను తనిఖీ చేసి ప్రత్యేక కమిటీ నిర్ణయం ద్వారా ఒకటి లేదా రెండుసార్లు పరీక్షలకు అనుమతించకుండా చేసే అవకాశాలున్నాయని వర్సిటీ రిజిస్ట్రార్ బి.అమర్నాథ్ తెలిపారు.
#
Tags