amp pages | Sakshi

మధ్యాహ్నం.. అధ్వానం

Published on Tue, 08/02/2016 - 18:31

  • మెనూ మచ్చుకైనా పాటించరు
  • రోజూ నాణ్యత లేని భోజనమే
  • తినలేకపోతున్న విద్యార్థులు 
  • కానరాని సౌకర్యాలు 
  • పట్టించుకోని అధికారులు 
  •  గోదావరిఖనిటౌన్‌/రామగుండం : నియోజకవర్గంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటోంది. ప్రభుత్వ మెనూ పత్తాలేకుండా పోయింది. వేసవి సెలవుత తర్వాత పాఠశాలలు ప్రారంభించినప్పటి నుంచి మధ్యాహ్న బోజన నిర్వాహకులు ఒకే రకమైన కూర వండుతున్నారు. అది కూడా  సరిగా ఉండడంలేదు. రోజూ ఒకే కూర తినలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తురన్నారు. ప్రాథమిక స్థాయి ఒక్కో విద్యార్థికి రూ.4.25పైసలు, హైస్కూల్‌ విద్యార్థికి రూ.6.65పై భోజనం కోసం ప్రభుత్వం మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం పప్పులు, కూరగాయలు, కోడిగుడ్ల ధరలు పెరుగడం, నిర్వాహకులకు నెలనెలా బిల్లులు సక్రమంగా రాకపోవడంతో మధ్యాహ్నం భోజనం నాణ్యత లోపిస్తోందని పలువురు అంటున్నారు. ప్రభుత్వ మెను ప్రకారం కిచిడి, లెమన్‌ రైస్, గ్రుడ్డు ఇతర ఏదైన అందించాలి. అది మచ్చుకైన కానరావడం లేదు. కొన్ని పాఠశాలల్లో మాత్రం గుడ్డును అందిస్తునారు. గోదావరిఖని విఠల్‌నగర్, కార్పొరేషన్‌ పరిధిలోని జనగామ గ్రామం, అశోక్‌గనర్‌లోని ప్రభుత్వ బాలికల పాఠశాల, గాంధీ పార్క్, గాంధీనగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, రామగుండం పట్టణంలోని పాఠశాలల్లో నిత్యం సుమారు 1500 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. రోజు ఒకే విధంగా పులుసును వడ్డిస్తుండడంతో ముద్ద దిగడం లేదని విద్యార్థులు అంటున్నారు. 
      
    జ్యోతినగర్‌ :  ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని ప్రభుత్వ జిల్లా ప్రజాపరిషత్‌ పాఠశాల, అన్నపూర్ణకాలనీలోని దుర్గయ్యపల్లె ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం బాగుందని విద్యార్థులు వెల్లడించారు. గతంలో కన్నా ప్రస్తుతం సన్నబియ్యం అన్నం చాలాబాగుందని తెలిపారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారని అంటున్నారు.  
     
    అధికారుల పర్యవేక్షణ కరువు
     బసంత్‌నగర్‌ :  క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బసంత్‌నగర్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడంలేదు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్వాహకులు భోజనం వండడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలు సగం కడుపుకే భోజనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో వంటలు రుచికరంగా ఉండకపోవడంతో  విద్యార్థులు మధ్యాహ్నం ఇళ్లకు వెళ్తున్నారు. ధరలు పెరిగాయని విద్యార్థులకు ప్రస్తుతం వారిని ఒకరోజు మాత్రమే గుడ్డు ఇస్తున్నారు.  
     
    రుచిగా ఉండడం లేదు
    – అనిల్, ఏడో తరగతి, బసంత్‌నగర్‌
    మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగానే సరిపోతోంది. ఎక్కువ రోజులు సాంబారు, ఆలుగడ్డ కూరనే పెడుతున్నరు. అవి కూడా అంతగా రుచిగా ఉండటం లేదు. రుచికరమైన భోజనం అందించాలి.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)