అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
చందాలు దండుకునేందుకే మినీ మహానాడ
Published on Thu, 05/25/2017 - 19:49
కొవ్వూరు : కొవ్వూరులో నిర్వహించిన టీడీపీ జిల్లా మినీ మహానాడు పేరుతో మంత్రి, నాయకులు భారీగా వ్యాపారుల నుంచి చందాలు దండుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత విమర్శించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మద్యం దుకాణాల నుంచి కిరాణా వర్తకుల వరకు చందాలు వసూలు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం లేకపోవడం మూలంగానే కొవ్వూరులో పెట్టిన జిల్లా మినీమహానాడు పూర్తిగా విఫలమైందన్నారు. నసమీకరణ కోసం ఉపాధి హామీ కూలీలకు మస్తర్ వేసి సభకు తరలించడం ఎంతవరకు సమజసం అని ప్రశ్నించారు. జిల్లాలో సమస్యలను గాలికి వదిలేసి మహానాడులో కేవలం ప్రతిపక్షంపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. చాగల్లు మండల పార్టీ అధ్యక్షుడు కోఠారు అశోక్బాబా, దళిత విభాగం రాష్ట్ర విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయరావు, మండల పార్టీ అధ్యక్షుడు గురుజు బాల మురళీకృష్ణ (చిన్నారి), నాయకులు గారపాటి వెంకటకృష్ణ, ఉప్పులూరి సూరిబాబు, కొఠారు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
#
Tags