amp pages | Sakshi

పాలమూరుపై కక్షసాధింపు

Published on Sat, 09/24/2016 - 23:26

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌) : జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపడుతున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, అంజయ్యయాదవ్‌ విమర్శించారు. జిల్లాపై ఆ పార్టీ కక్షసాధిస్తోందని వారు ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్‌లో విలేకరులతో వారు మాట్లాడుతూ 60ఏళ్లలో వలసల జిల్లాగా మార్చారన్నారు. 
 
అపెక్స్‌ కమిటీ సమావేశంలో ‘పాలమూరు’ను అడ్డుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వాదించగా సీఎం కేసీఆర్‌ తిప్పికొట్టారన్నారు. దీంతో వారి నిజస్వరూపం బయటపడిందని, ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ నాయకులు జిల్లా ప్రజలవైపా.. ఆంధ్ర వైపా అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో సాగు, తాగు నీటిలో జిల్లాకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలను ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. వచ్చే ఏడాది మార్చినాటికి మన్యంకొండ సంప్‌హౌస్‌ను పూర్తి చేసి మహబూబ్‌నగర్‌ పట్టణానికి తాగునీరందిస్తామన్నారు. 
 శంషాబాద్‌వైపు ప్రజల మొగ్గు 
షాద్‌నగర్‌ నియోజకర్గ ప్రజలు శంషాబాద్‌ జిల్లాలోనే కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. జిల్లా కేంద్రం అతి సమీపంలోకి రావడంతో అక్కడి ప్రజలు మహబూబ్‌నగర్‌ నుంచి విడిపోయేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. కుట్రలకు పెట్టింది పేరు ఆంధ్ర పాలకులని విమర్శించారు. ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్వర్, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, శివకుమార్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)