ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పుష్కర క్షేత్రంలో భక్తుల సందడి
Published on Mon, 08/01/2016 - 21:58
బాల్కొండ/మోర్తాడ్/రెంజల్ : అంత్య పుష్కరాల రెండో రోజు సోమవారం భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండప్రదానం చేశారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రంలో 2, 4 ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. నదిలోని పురాతన శివాలయం వద్ద భక్తులు పూజలు చేశారు. మోర్తాడ్ మండలంలోని తడపాకల్, బాల్కొండ మండలంలోని ఎస్సారెస్పీ పుష్కర ఘాట్ల వద్ద కూడా సోమవారం సందడి కనిపించింది. ఎస్సారెస్పీ పుష్కర ఘాట్లకు భక్తులు తరలివచ్చారు. సమీపంలోని కోదండ రామాలయంలో పూజలు చేశారు. మహంకాళి ఆలయంలో రెండో రోజూ నవ చండీ యాగం కొనసాగింది.
#
Tags