వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అంధుల సంక్షేమానికి కృషి
Published on Sun, 09/11/2016 - 23:05
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో అంధులకు సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు కృషి చేస్తామని అంధ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జి.రవీంద్రబాబు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని విజేత హోటల్లో సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓ 104 ప్రకారం అంధుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 1800 మంది అంధులు ఉన్నారని, అందరికీ ప్రభుత్వ పింఛన్ అందకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. విద్యావంతులైన అంధులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కోల వెంకటరమణ మాట్లాడుతూ అంధుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
నూతన కార్యవర్గమిదే..
జిల్లా అధ్యక్షునిగా కోల వెంకటరావు, ఉపాధ్యక్షునిగా కె.అప్పలనాయుడు, కోశాధికారిగా ఎ.రాము, కార్యదర్శిగా వై.అమ్మన్నాయుడు, సంయుక్త కార్యదర్శి వి.గోవిందరావు, కార్యనిర్వహణ కార్యదర్శిగా పి.శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వై.వెంకటప్పడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
#
Tags