అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అక్రమాలకు పాల్పడితే పోరాటం
Published on Wed, 09/28/2016 - 01:32
- ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక
నెల్లూరు, సిటీ: ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి పనులకు మంజూరైన సబ్ప్లాన్ నిధుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడితే పోరాటం తప్పదని ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర కార్యదర్శి బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్లో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలకు తెలుసన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మేయర్ అజీజ్, అధికారులు దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎస్సీ సబ్ప్లాన్ కాంట్రాక్ట్ పనులను ఎస్సీ, ఎస్టీ, వడ్డెర కులాల వారికి 15 శాతం కేటాయించాల్సి ఉందని, అయితే కార్పొరేషన్లో మేయర్,అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వేదిక జిల్లా అధ్యక్షులు పరుశు మస్తానయ్య, లాలాకృష్ణ, మామిడి శ్రీనివాసులు, సత్యనారాయణ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
#
Tags