నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కమనీయం..శ్రీవారి కల్యాణోత్సవం
Published on Sun, 12/25/2016 - 22:37
అనంతపురం కల్చరల్ : ధనుర్మాస పూజోత్సవం సందర్భంగా శ్రీనివాస కల్యాణం ఆదివారం కనుల పండువగా జరిగింది. స్థానిక ఆర్ఎఫ్రోడ్డులోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ప్రధాన అర్చకులు ఏఎల్ఎన్ శాస్త్రి ఆధ్వర్యంలో నేత్రపర్వంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా కల్యాణ వేడుకలు జరిపించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ మాంగళ్యధారణ జరిగింది.
మధ్యాహ్నం అన్నదానం జరిగింది. రాత్రి సర్వాంగ సుందరంగా అలంకరించిన దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను నగరవీధులలో ఊరేగించారు. వందల సంఖ్యలో గోవింద మాలధారులు శ్రీవారి నామస్మరణతో ఆనందతాండవం ముందుకు సాగింది. కార్యక్రమంలో గోవింద మాలధారుల సంఘం నేతలు నాగరాజు, సత్యనారాయణ, రమణ పాల్గొన్నారు.
#
Tags