amp pages | Sakshi

కాగితాలకే పరిమితమా?

Published on Fri, 06/09/2017 - 22:35

- చిరు, నవధాన్యాలంటూ రెండేళ్లుగా ఊరిస్తున్న వ్యవసాయ శాఖ
- ఆచరణలో మాత్రం వైఫల్యం
- కొరవడిన ప్రచారం, ప్రోత్సాహం
- వేరుశనగకే మొగ్గు చూపుతున్న రైతులు
- 1960–80 మధ్య కాలంలో నవధాన్యాలదే హవా


అనంతపురం అగ్రికల్చర్‌ : చిరుధాన్యాలు, తృణధాన్యాలు, నవధ్యానాలు, బహుధాన్యాలు, పప్పుధాన్యాలు... ఈ పేర్లు గత రెండు, మూడేళ్లుగా బాగానే విన్పిస్తున్నాయి. లక్షల హెక్టార్లలో ఈ పంటలను సాగులోకి తెస్తామని వ్యవసాయ శాఖ ప్రతియేటా ప్రచార ఆర్భాటం చేస్తోంది. ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. ఏక పంట విధానానికి స్వస్తి చెబుతూ పంటల్లో వైవిధ్యం ఉండేలా ప్రణాళికలు రూపొందించామని ఖరీఫ్‌ సమయంలో ప్రకటనలు చేయడం.. చివరికి చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. వేరుశనగ పంట విస్తీర్ణాన్ని బాగా తగ్గించి ఆ స్థానంలో జొన్న, సజ్జ, రాగి, కొర్ర, మొక్కజొన్న, కంది, ఆముదం, పత్తి, పొద్దుతిరుగుడు, అలసంద, పెసర, మినుము పంటల విస్తీర్ణం బాగా పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సాధ్యం కావడం లేదు.

ఈ ఖరీఫ్‌లో సాగుకు సమయం ఆసన్నమైనా వ్యవసాయశాఖ దగ్గర సరైన విత్తన ప్రణాళిక కూడా లేకపోవడం గమనార్హం. నవధాన్యపు కిట్లు అంటూ కంటితుడుపుగా ఏడు రకాల విత్తనాలు కలిపి ఐదు కిలోల చొప్పున ఇస్తున్నారు. ఈ కిట్లలో విత్తన నాణ్యతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్టిఫైడ్‌ సీడ్‌ కాకుండా మామూలు విత్తనాలు అందులో ప్యాక్‌ చేశారని రైతులు చెబుతున్నారు. కిట్లు కూడా సకాలంలో సిద్ధం చేయకపోవడంతో పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఈ సీజన్‌లో ఐదు లక్షల కిట్లు ఇస్తామని చెప్పారు.  ఇందులో ఇప్పటికీ 25 వేల కిట్లకు మించి పంపిణీ చేయలేదు.

బలం, బలహీనత వేరుశనగే..
2012, 2013 సంవత్సరాల్లో జిల్లాలో పర్యటించిన భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్‌) హైపవర్‌ టెక్నికల్‌ కమిటీ జిల్లా రైతుల బలం, బలహీనత వేరుశనగ పంటేనని గుర్తించింది. వేరుశనగ విస్తీర్ణాన్ని బాగా తగ్గించి.. దాని స్థానంలో చిరుధాన్యాలు, పప్పుధాన్యపు పంటల సాగు బాగా పెంచితే కానీ వ్యవసాయం లాభసాటి కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేసింది. నాలుగేళ్లు అవుతున్నా ఆ దిశగా అడుగులు మాత్రం పడటం లేదు.

గతంలో ఈ పంటలదే హవా
జిల్లా వ్యవసాయ చరిత్రను తిరగేస్తే.. గతంలో పంటల వైవిధ్యం స్పష్టంగా ఉండేది. నాలుగు నుంచి పది రకాల పంటలు పండించేవారు. తీవ్ర కరువులు ఏర్పడినా తిండి గింజలకు సమస్య ఉండేది కాదు. హరిత విప్లవం నేపథ్యంలో జిల్లా వ్యవసాయ రూపురేఖలు మారిపోయాయి. చిరుధాన్యాలు, నవధాన్యపు పంటలకు స్థానం లేకుండా పోయింది. వాటి స్థానంలో వాణిజ్య పంటగా వేరుశనగ వచ్చింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పదేళ్ల ఒకసారి కూడా వేరుశనగ పండే పరిస్థితి లేదు. 1960కు ముందు నుంచి 1985 వరకు  జిల్లాలో చిరుధాన్యపు పంటలదే రాజ్యం. ఆరికలు, సామలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జ తదితర పంటలు బాగా పండించేవారు. 1961–62 సీజన్‌లో ఈ రకం పంటలు ఏకంగా 5.55 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. అప్పట్లో వేరుశనగ 1.94 లక్షల హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది. పప్పుధాన్యాలు కూడా 1.10 లక్షల హెక్టార్లలో పండించారు.

వరి కూడా 50 వేల హెక్టార్లకు పైగా వేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. 1971–72లో చిరుధాన్యపు పంటల విస్తీర్ణం 4.01 లక్షల హెక్టార్లు కాగా.. వేరుశనగ 2.55 లక్షల హెక్టార్లలో వేశారు. 1980 దశకం వరకు వరి, వేరుశనగ, చిరుధాన్యాలు, పప్పుధాన్యపు పంటల సాగులో సమతుల్యత బాగా కనిపించింది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1991–92 సంవత్సరంలో చిరుధాన్యపు పంటలు కేవలం 60 వేల హెక్టార్లకు పరిమితమయ్యాయి. ఇదే తరుణంలో వేరుశనగ ఒక్కసారిగా 7.35 లక్షల హెక్టార్లకు ఎగబాకింది. ఇక 2001–02లో చిరుధాన్యపు పంటలు 30 వేల హెక్టార్లకు పడిపోగా.. వేరుశనగ 7.80 లక్షల హెక్టార్లకు చేరుకుంది.

2010–11 విషయానికొస్తే చిరుధాన్యపు పంటలు 20 వేల హెక్టార్లకు మాత్రమే పరిమితం కాగా.. వేరుశనగ 8.34 లక్షల హెక్టార్లకు పెరిగింది. గత నాలుగైదేళ్లుగా వేరుశనగ విస్తీర్ణం కాస్త తగ్గినా.. దాని స్థానంలో చిరు, నవధాన్యపు పంటల విస్తీర్ణం పెరగకపోవడం గమనార్హం. 2015 ఖరీఫ్‌లో కొంత పెరిగినట్లు కనిపించినా తెగుళ్లు ఆశించి పంటలను దెబ్బతీయడంతో 2016లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు విస్తీర్ణం కూడా బాగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఐదారేళ్ల కిందటి వరకు ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 9 నుంచి 9.50 లక్షల హెక్టార్లుగా ఉండేది. ఆ తర్వాత 8 నుంచి 8.20 లక్షల హెక్టార్లకు పరిమితమైంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)