రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యుదాఘాతానికి టెలిఫోన్ లైన్ మన్ బలి
Published on Tue, 02/14/2017 - 01:56
హిందూపురం అర్బన్ : విద్యుదాఘాతానికి టెలిఫోన్ లైన్ మన్ నాగిరెడ్డి (50) సోమవారం బలయ్యాడు. వివరాలు..మండలంలోని నక్కలపల్లికి చెందిన నాగిరెడ్డి టెలిఫోన్ లైన్ మన్ గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా హిందూపురంలో స్థిరపడ్డాడు. సోమవారం శాంతీటాకీస్ ఏరియాలో టెలిఫోన్లు లైన్లు మరమ్మతు చేస్తున్నాడు. సమీపంలోని ఇంటిపైకి ఎక్కి కేబుల్ను అవతలికి విసిరేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కేబుల్ 33 కేవీ హైటెక్ష¯ŒS తీగలకు తగిలింది. చేతిలోనే కేబుల్ పట్టుకుని ఉండగా అదే సమయంలో విద్యుత్ ప్రసరించింది. విద్యుత్ షాక్కు గురై అక్కడే పడిపోయాడు.
స్థానికులు గమనించి విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, బాధితుడిని చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి చూడగా అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. టెలిఫో¯ŒS ఎక్సేంజ్ కార్యాలయంలో అందరితో సన్నిహితంగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరున్న నాగిరెడ్డి మరణించడాన్ని సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసును వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికులు గమనించి విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, బాధితుడిని చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి చూడగా అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. టెలిఫో¯ŒS ఎక్సేంజ్ కార్యాలయంలో అందరితో సన్నిహితంగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరున్న నాగిరెడ్డి మరణించడాన్ని సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసును వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags