చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అమెరికాలో గుంటూరు మహిళ దుర్మరణం
Published on Fri, 09/11/2015 - 09:07
బాపట్ల: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన బాలినేని మాధురి (39) దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన మాధురి కుటుంబం11 ఏళ్ల క్రితమే ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. భారత కాలమాన ప్రకారం నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఒకాలా పట్టణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదంలో మాధవి అక్కడికక్కడే మృతిచెందగా..భర్త చేబ్రోలు త్రివిక్రమ్కు గాయాలయ్యాయి.
వినాయకచవితికి ఇంటికి వస్తామని చెప్పిన తన కుమార్తె విగతజీవిగా మారిందంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. మాధురి మృతితో బాపట్లలోని వివేకానంద కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. మాధవి, త్రివిక్రమ్ ఇద్దరూ ఫార్మాసిష్టులుగా పనిచేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags