amp pages | Sakshi

రాజధాని శంకుస్థాపన పండుగలా జరపాలి

Published on Wed, 10/07/2015 - 04:32

♦ 13 నుంచి 21 వరకు జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
♦ అన్ని గ్రామాల నుంచి సంకల్పజ్యోతి ర్యాలీలు
♦ ప్రతి ఊరి నుంచి ‘మట్టి’ని సేకరించి.. అమరావతికి తేవాలి
♦ సీఆర్‌డీఏ సమీక్షలో  సీఎం చంద్రబాబు నిర్దేశం
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించాలని, ఏర్పాట్లు ఘనంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పండుగ వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) సమావేశంలో శంకుస్థాపన ఏర్పాట్లపై సీఎం సమీక్షించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి సంకల్ప జ్యోతిని ప్రతి గ్రామం నుంచి ఆయా మండలాలకు, అక్కడినుంచి జిల్లాలకు ర్యాలీలుగా తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రం నుంచి ఈ జ్యోతిని గుంటూరు సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణం వద్దకు తీసుకొచ్చేలా చూడాలన్నారు. అక్కడ అమరావతి సంకల్ప జ్యోతిని స్వయంగా తాను స్వీకరిస్తానని చెప్పారు.

 పుణ్య నదుల జలాల్నీ తేవాలి..
 ప్రతి గ్రామంలోనూ పుట్టమట్టిని, చెరువులు, కాలువల వద్ద నుంచి మట్టిని సేకరించి.. సర్వమత ప్రార్థనలతో పవిత్రంగా అమరావతి ప్రాంగణానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. గ్రామాలనుంచి మండలాలకు, అటునుంచి జిల్లా కేంద్రాలకు, అక్కడినుంచి శంకుస్థాపన ప్రాంగణానికి తీసుకొచ్చిన మట్టిని ఒకచోటకు చేర్చి దాన్లోని కొంతభాగాన్ని రాజధాని శంకుస్థాపనకు వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలోని నదులు, ఉపనదుల నుంచి పవిత్ర జలాలతోపాటు దేశంలోని పుణ్యనదుల జలాల్నీ శంకుస్థాపనకు తీసుకురావాలన్నారు. ఆయా గ్రామాల్లో సంకల్పజ్యోతి, మట్టి సేకరణలో ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనాలన్నారు. రాజధానికి భూమినిచ్చిన ప్రతి రైతుకూ ప్రత్యేక ఆహ్వానపత్రాన్నిచ్చి ఆహ్వానించాలని అధికారుల్ని ఆదేశించారు. వారికి ప్రభుత్వం తరఫున ఇచ్చేందుకు ఆప్కో నుంచి నూతన వస్త్రాలు కొనుగోలు చేయాలన్నారు.

 ప్రతిష్టాత్మకంగా లోగో రూపకల్పన..
 అమరావతి లోగో రూపకల్పనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బాబు సూచిస్తూ.. అది మన సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా ఉండాలన్నారు. ఇందుకోసం నిర్వహిస్తున్న పోటీలో వచ్చిన మూడు ఉత్తమ లోగోలను ఎంపిక చేసి వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఆదేశించారు. అంతిమంగా ప్రజలు ఆమోదించిన దాన్నే అమరావతి లోగోగా ఎంపిక చేయాలని నిర్దేశించారు. ప్రజలంతా శంకుస్థాపనలో భాగస్వాములయ్యేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)