amp pages | Sakshi

ప్రభుత్వ వైఖరి చెప్పాల్సిందే

Published on Sun, 12/06/2015 - 03:49

సాక్షి, హైదరాబాద్ : ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను విచారణార్హమైన (కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియచేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, జరిమానా విధించడానికి బదులు ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను కాగ్నిజబుల్, నాన్ బెయిల్‌బుల్ నేరాలుగా ఎందుకు పరిగణించకూడదో స్పష్టం చేసి తీరాల్సిందేనని గనుల శాఖ సంయుక్త కార్యదర్శికి స్పష్టం చేసింది. అంతేకాక ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాతో సంబంధం ఉన్న వారిలో ఎంత మందిని అరెస్ట్ చేశారో, నెలల వారీగా గణాంకాలను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక రవాణా చేస్తున్న తమ వాహనాలను అధికారులు సీజ్ చేశారని, ఈ విషయంలో వారు చట్టం నిర్ధేశించిన ప్రక్రియను అనుసరించలేదని, తమ వాహనాలను విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మెదక్ జిల్లాకు చెందిన బండారి పాపిరెడ్డి, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు గనులశాఖ సంయుక్త కార్యదర్శి తన కౌంటర్ అఫిడవిట్‌ను కోర్టు ముందుంచారు. అయితే ఈ అఫిడవిట్‌లో కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ నేరాలుగా ఎందుకు పరిగణించకూడదన్న కోర్టు ప్రశ్నకు ఎటువంటి సమాధానం లేదు.

ప్రస్తుతం ఉన్న నిబంధనలకు అదనంగా హైకోర్టు ఏవైనా సూచనలు, సలహాలిస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి ఒకింత విస్మయం వ్యక్తం చేశారు. కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణించే విషయంలో వైఖరి స్పష్టం చేయకుండా, కోర్టు సూచనలు, సలహాలు పాటిస్తామనడాన్ని తప్పుపట్టారు. కోర్టు ఆదేశించిన విధంగా వైఖరిని తెలియచేయాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అక్రమ మైనింగ్, రవాణా తగ్గిందన్న ప్రభుత్వ న్యాయవాది, అందుకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచకపోవడాన్ని కూడా న్యాయమూర్తి ఎత్తి చూపారు. 371 ట్రక్కులను జప్తు చేశామన్న ప్రభుత్వ న్యాయవాది, అందుకు సంబంధించి ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పలేదన్నారు. తదుపరి విచారణ సమయానికి పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌