amp pages | Sakshi

మరో మూడు డెంగీ కేసులు

Published on Fri, 09/23/2016 - 23:21

33కు చేరిన  సంఖ్య 
 
విజయనగరం ఫోర్ట్‌/మున్సిపాలిటీ  : జిల్లాలో మరో మూడు డెంగీ  కేసులు  నమోదయ్యాయి. చంద్రబాబు సర్కార్‌ దోమలపై దండయాత్ర పేరుతో ఓ వైపు వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెబుతున్న సమయంలో వ్యాధుల వ్యాప్తి అధికమవుతుండడం గమనార్హం. విజయనగరం పట్టణంలో రెండు, తోటపల్లిలో మరో డెంగీ కేసు శుక్రవారం నమోదయ్యాయి. విజయనగరం పట్టణంలోని లంక పందిరివీధికి చెందిన హాసిని, గాజులరేగకు చెందిన వివేక్‌సాయి , తోటపల్లికి చెంది స్పందనలకు డెంగీ సోకింది. హాసిని(హర్షిణి), వివేక్‌సాయిలు పట్టణంలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
 
బందాలు పర్యటిస్తున్నప్పుడే..
  జిల్లాలో మలేరియా, డెంగీ  వ్యాధుల నియంత్రణకు 9 మెుబైల్‌ టీమ్‌లు పర్యటిస్తున్నాయి. వ్యాధులు రాకుండా ఏ జాగ్రత్తలు, తీసుకోవాలి, వేటి వల్ల దోమలు వద్ధి చెందుతాయి వంటి విషయాలపై మోబైల్‌ టీమ్‌లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే వ్యాధులు ప్రబలుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.  
 
అప్రమత్తంగా ఉండాలి..
 డెంగీ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అధికారులకు సూచించారు. పట్టణానికి చెందిన వివేక్‌ సాయి, హాసిని (హర్షిణి) ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్‌ చైర్మన్‌ ప్రసాదుల రామకష్ణ, కమిషనర్‌ జి.నాగరాజు ఆస్పత్రిని సందర్శించి చిన్నారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ ధ్రువీకరణ చేయకుండా డెంగీ జ్వరంగా ఎలా నిర్ధారించి, చికిత్స అందిస్తారని కలెక్టర్‌ ప్రశ్నించారు. ఇందుకుసంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాని ఆదేశించారు. పరిశీలనలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుధాకర్‌ పట్నాయక్, ఆర్డీఓ శ్రీనివాసమూర్తి,  జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు. 
 
 వైద్యాధికారి సంతకంతో డెంగీ నివేదిక 
  డెంగీ  నివేదికలను వైద్యాధికారి సంతకం, స్టాంపు  వేసి ఇవ్వాలని కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక కేంద్రాస్పత్రిలో ఉన్న ఐడీఎస్‌పీ లేబరేటరీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పరికరాలను పరిశీలించారు. నివేదికలపై తప్పకుండా సంబంధిత వైద్యాధికారి సంతకం ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సుధాకర్‌ పట్నాయక్, డీసీహెచ్‌ఎస్‌ గరికిపాటి ఉషశ్రీ , కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్‌ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. 
 
 

#

Tags

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)