amp pages | Sakshi

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి

Published on Thu, 08/04/2016 - 22:17

మిర్యాలగూడ : టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద భూ నిర్వాసితులు చేపడుతున్న రిలే దీక్షలకు గురువారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు వల్ల ప్రస్తుతం నాలుగు గ్రామాలు నీటమునిగే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా ఎనిమిది ఎత్తిపోతల పథకాలు కూడా మునిగిపోతున్నాయని, వాటి పరిధిలోని నాలుగు వేల ఎకరాల భూమి బీడుగా మారనుందని పేర్కొన్నారు. 42 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తిరిగి యధావిధిగా ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని, ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పించాలని డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా గతంలో కేవలం ఎకరానికి 1.25 లక్షల రూపాయలే చెల్లించారని, ప్రస్తుతం ముంపు గ్రామాల ప్రజలకు ప్రస్తుతం మార్కెట్‌ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లింలని డిమాండ్‌ చేశారు.  మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు భూసేకరణ చట్టం –2013 ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్‌ సత్యనారాయణరెడ్డితో సమావేశమై భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యానాయక్, కాంగ్రెస్‌ నాయకులు స్కైలాబ్‌నాయక్, పగిడి రామలింగయ్య, చిరుమర్రి కృష్ణయ్య, కందిమళ్ల లక్షా్మరెడ్డి, సీపీఎం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, రవినాయక్, చంద్రశేఖర్‌యాదవ్, కమిటీ నాయకులు హనుమంతునాయక్, లాలునాయక్, మునినాయక్, బాబి, సేవానాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)