వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా రైళ్ల పునరుద్ధరణ
Published on Tue, 11/17/2015 - 11:53
రాజంపేట: భారీ వర్షాలతో రాయలసీమలోని పలు జంక్షన్ లలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్లను అధికారులు పునరుద్ధరించారు. నందలూరు-ఒంటిమిట్ల మధ్యలో దెబ్బతిన్న రైల్వేట్రాక్కు మరమ్మతులు పూర్తి కావడంతో వివిధ స్టేషన్లలో ఆగిపోయిన రైళ్లు బయలు దేరాయి. మంగళవారం ఉదయం మంటపం పల్లి వద్ద గౌహతి- చెన్నై ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన విషయం విదితమే.
ఫలితంగా ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఐదు గంటల అనంతరం కోరమాండల్, హరిప్రియ, ఎగ్మూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు బయలుదేరాయి. తిరుపతి - గుంతకల్లు మార్గంలోని సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడటంతో కూడా పలు రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే శాఖ మరమ్మత్తులు చేపట్టి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించింది.
#
Tags