amp pages | Sakshi

ఉద్యోగాల పేరుతో వసూళ్ల యత్నం?

Published on Sat, 12/03/2016 - 22:19

పోలీసుల అదుపులో ఇద్దరు సంస్థ ఉద్యోగులు
 
గుంటూరు ఈస్ట్‌ : ఉద్యోగాల పేరుతో దరఖాస్తుదారుల నుంచి రూ.1200 చొప్పున రుసుం వసూలు చేస్తున్న ఓ కంపెనీ సిబ్బందిని పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కొన్ని సెల్‌ఫోన్లు, రూ.43 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్‌ సీఐ రత్నస్వామి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన సత్యనారాయణ గత నెలలో పేపర్‌ ప్రకటనల ద్వారా శ్రీనివాసులు, అతని భార్యను ఉద్యోగులుగా నియామకం చేసుకున్నాడు. జేకేసీ కళాశాల రోడ్డు మొదట్లోని ఓ భవనం పై అంతస్తులో ఓ గది అద్దెకు తీసుకుని నవంబరు 25వ తేదీన కార్యాలయం ప్రారంభించాడు. ఒమేగా ఫార్మటికల్స్‌ పేరుతో ఆసంస్థలో పనిచేయడానికి ఉద్యోగులు కావాలని పేపర్‌ ప్రకటన ఇచ్చాడు. దీంతో అనేక మంది నిరుద్యోగులు కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులు ఇచ్చారు. ఽతమ కంపెనీలో సూపర్‌వైజర్‌కు రూ.18 వేలు జీతం ఇస్తారని, అంతకన్నా తక్కువ ఉద్యోగాలకు రూ.10వేల వరకు జీతాలు ఇస్తారని శ్రీనివాసులు చెప్పాడు. దరఖాస్తు రుసుం ఒక్కొక్కరి నుంచి రూ.1200 వసూలు చేయడం ప్రారంభించాడు. శనివారం ఉదయం ఉద్యోగం కోసమని కార్యాలయానికి వెళ్లిన కొందరికి వీరి వ్యవహారంపై అనుమానం వచ్చింది. శ్రీనివాసులు ఇచ్చిన రసీదుపై ఉన్న కంపెనీ పేరు ఫార్మాసూటికల్స్‌ అని కాకుండా ఫార్మటికల్స్‌ అని ఉండడంతో వారి అనుమానం బలపడింది. దీంతో వారు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అర్బన్‌ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాల మేరకు సీసీఎస్‌ సీఐ రత్నస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని, వచ్చిన అభ్యర్థులను విచారించారు. శ్రీనివాసులు, అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. వారు పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో వారిద్దరినీ పోలీసుస్టేషన్‌కు తరలించారు. వారి వద్ద ఉన్న కొన్ని సెల్‌ఫోన్లు, రూ.43 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)