వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Published on Tue, 07/12/2016 - 08:35
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగుతోంది. ఈ నెల 16న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఉగాది,ఆణఙవార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో వైదికమైన ఈ కార్యక్రమం నిర్వహించడం సంప్రదాయం.
పసుపు, చందనం, కుంకుమ, తిరునామం, పచ్చకర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ప్రత్యేక లేపనంతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేశారు. శుద్ధి కార్యక్రమం నిర్వహించిన అనంతరం దర్శనానికి అనుమతిస్తారు. దీంతో ఉదయం నిర్వహించాల్సిన అష్టదశ పాద పద్మారాధన సేవను రద్దు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో కొత్త పరదాలు అలంకరించనున్నారు. తిరుపతికి చెందిన మేకల సుబ్రమణ్యం ఐదు పరదాలను స్వామివారికి సమర్పించారు.
Tags