తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కలెక్టరేట్ ముట్టడి
Published on Thu, 07/28/2016 - 22:34
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ టీవీవీ నాయకులు, కళాశాలల విద్యార్థులు గురువారం కలెక్టరేట్ ముట్టడించారు. కలెక్టరేట్లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన గేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీవీవీ జిల్లా అధ్యక్షుడు రాహుల్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రవేశపెడుతామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు దాని ఊసేత్తడం లేదని ఆరోపించారు. కళాశాలలు ప్రారంభమైన నెలన్నర గడుస్తున్నా మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదని పేర్కొన్నారు.
కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని మరుగుదొడ్లు నిర్మించాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విద్యార్థులు, నాయకులు ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అనంతరం కలెక్టర్ ఎం.జగన్మోహన్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీవీవీ నాయకులు వసంత్, సాగర్, సతీష్, వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు.
#
Tags