పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పిడుగుపాటుకు రెండు గేదెల మృతి
Published on Sat, 07/30/2016 - 20:56
రేవనపల్లి(భూదాన్పోచంపల్లి)
పిడుగుపాటుకు రెండు గెదెలు మృతిచెందాయి. ఈ ఘటన మండలంలోని రేవనపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకొంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన రైతు మైల నర్సింహ రోజుమాదిరిగా శుక్రవారం సాయంత్రం గ్రామసమీపంలోని వ్యవసాయ బావి వద్ద గేదెలను కట్టేసి ఇంటికి వచ్చాడు.రాత్రి వర్షంతో పాటు పిడుగు పడింది. శనివారం ఉదయం బావి వద్దకు వచ్చి చూడగా చెట్టుకు కట్టేసి ఉన్న రెండు ముర్రాజాతి గేదెలు మృతిచెంది ఉన్నాయి. వీటి విలువ రూ. 1.30 లక్షలు ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. సమాచారం అందుకొన్న ఆర్ఐ నిర్మల, మండల పశువైద్యాధికారి రాంచంద్రారెడ్డి, వీఆర్వో సుదర్శన్రావు, సర్పంచ్ గోదాసు శశిరేఖజంగయ్యలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి నుంచి వివరాలను అడిగి తెలుసుకొని పంచానామా నిర్వహించారు.
#
Tags