నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వాళ్లు మావోయిస్టులు కాదు... వేటగాళ్లు!
Published on Tue, 02/23/2016 - 14:55
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా కొయ్యూరు అటవీ ప్రాంతంలో ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన వారు మావోయిస్టులు కాదని... వారు కేవలం వేటగాళ్లు మాత్రమే అని సమాచారం. ఒడిశా రాష్ట్రం కోరుకొండ బ్లాక్ తుంటా గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అడవిలో గేదెలను పట్టుకోవడానికి వచ్చిన సమయంలో వారి చేతుల్లో నాటు తుపాకులు ఉండటంతో మావోలుగా పొరబడి పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో పొడియం గంగాళ్, మడసం గంగాలు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఇరుమాళ్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
#
Tags