మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అంగరంగ వైభవం.. వీరభద్రస్వామి రథోత్సవం
Published on Thu, 12/15/2016 - 00:33
గుమ్మఘట్ట మండలం తాళ్లకెరలో బుధవారం అశేష భక్తజనం నడుమ వీరభద్రస్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలువురు పీఠాధిపతులు, వేదపండితుల ఆధ్వర్యంలో వేకువ జామునే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని రాష్ట్ర వీరశైవ సంఘం అధ్యక్షులు, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గ్రామస్తులతో కలసి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై కొలువుదీర్చారు. రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రేవణ సిద్ధేశ్వర ట్రస్ట్ సభ్యులు అన్నదానం తో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించారు
#
Tags