Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బుద్దొచ్చింది.. మళ్లీ ఆ తప్పు చేయం
Published on Sat, 08/27/2016 - 22:17
బాబుకు ఓటేసి మోసపోయాం
పెద్దింపేట పంచాయతీ ప్రజల పశ్చాత్తాపం
పెద్దింపేట(బలిజిపేట రూరల్): చంద్రబాబు బురిడీ మాటలకు మోసపోయాం.. భవిష్యత్తులో మళ్ళీ ఆ తప్పు చేయం..అని పెద్దింపేట, పోలినాయుడువలస, గౌరీపురం గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. పెద్దింపేట పంచాయతీ పరిధిలోని పెద్దింపేట, గౌరీపురం, పోలినాయుడువలస గ్రామాల్లో శనివారం వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత హామీలు, పాలనపై అసంతప్తి వ్యక్తం చేశారు. ఇస్తున్న పింఛన్లను తొలగించారని లక్షు్మందొర, టి.తవిటినాయుడులు తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని.. కనీసం కూలి పని దొరకటం లేదని పోలినాయుడువలస గ్రామానికి చెందిన మహిళలు గౌరమ్మ, పైడితల్లి తెలిపారు. పెద్దింపేట ఎస్సీ కాలనీలో సమస్యలు వేధిస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని వెంకటరమణ, రతాలు, నరసమ్మ తెలిపారు. ఉద్యోగం, పింఛన్లు, ఇళ్లు, రుణమాఫీ లేదని లక్ష్మి, అన్నపూర్ణ, రత్నాలు, రామలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, నీటి సదుపాయాల్లేవని ఎస్సీ కాలనీ మహిళలు ఆవేదన చెందారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, బందలుప్పి ఎంపీటీసీ యాళ్ళ ప్రతాప్కుమార్, ఎంఆర్ నగర్ ఎంపీటీసీ బడే రామారావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కేతిరెడ్డి రాఘవ, ఎస్టీ సెల్ పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు వీటీ దేవీ ప్రసాద్ థాట్రాజ్, పార్వతీపురం పట్టణ వైఎస్సార్ సీపీ యూత్ అధ్యక్షుడు బొంగు ఉమామహేశ్వరరావు, స్థానిక నాయకులు పి.మురళీకష్ణ, పెద్దింపేట మాజీ సర్పంచ్ ఎం.సాంబమూర్తి, నారాయణపురం సర్పంచ్ ఎం.ప్రసాద్, ఎంపీటీసీ ఎం.శ్రీరామూర్తి, జి.గోపాల్, ఎం.జనార్దన్, వి.పోలినాయుడు, జి.శంకరరావు, టి.క్రిష్ణ, పకీరునాయుడు, కర్రి సింహాచలం, సూరందొర, బి.సత్యన్నారాయణ, పి.నారాయణరావు, వి.సీతారాంనాయుడు, మజ్జి సత్యంనాయుడు, కె.సత్యంనాయుడు, వి.ఉగాదినాయుడు పాల్గొన్నారు.
#
Tags