నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నీళ్లెందుకు వదలరు?
Published on Tue, 09/06/2016 - 23:09
కౌతవరం(గుడ్లవల్లేరు):
నీళ్లెందుకు వదలడం లేదు... సీఈ ముందు ప్రజాప్రతినిధుల నిలదీత...నీళ్లెందుకు వదలడం లేదు.. కింది అధికారులపై సీఈ ఆగ్రహం.... నెపాన్ని ఒకరిపై ఒకరు వేసుకున్నారు. కౌతవరం ఇరిగేషన్ బంగ్లాలో ఈ తమాషా చోటుచేసుకుంది. కాలువలకు ఎందుకు నీళ్లు వదలలేదని ఇరిగేషన్ ఇంజనీర్లపై సీఈ వై.సుధాకర్ మండిపడ్డారు. మూడు రోజులుగా బంటుమిల్లి కాల్వలో సాగునీరు రాకుండా నిలిపివేశారని సీఈకి పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఫిర్యాదు చేశారు. మంగళవారం కౌతవరం ఇరిగేషన్ బంగ్లాకు వచ్చిన సీఈ ఎందుకు నీరు ఇవ్వటం లేదని స్థానిక అధికారులపై ఆగ్రహించారు. బంటుమిల్లి హెడ్ వద్ద కాల్వ గట్టు పటిష్టం చేసే పనులు చేస్తున్నామని అధికారులు బదులిచ్చారు. దానితో ఆగ్రహించిన సీఈ వెంటనే 400 క్యూసెక్కులు వదలాలని ఆదేశించడంతో హుటావుటిన నీటి విడుదల చేశారు. నీరొచ్చినా నారు లేదని సీఈకి ఎమ్మెల్యే కాగిత చెప్పారు. బయట నుంచి ఎక్కువ ధరకు నారు కొనుగోలు చేసుకున్న తమ ప్రాంత రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారన్నారు. తీరా మూడు రోజులుగా నీరు నిలిపివేయటంతో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.
#
Tags