అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
తాగునీటి కోసం మహిళల ధర్నా
Published on Tue, 07/26/2016 - 01:31
నూతనకల్
మండలంలోని మామిళ్లమడవ గ్రామంలో తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం గ్రామంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ 20రోజుల నుంచి గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేక అవస్థలు పడుతున్నామన్నారు. గ్రామానికి మంచినీటి సరఫరా చేసే బోరు మోటారు చెడిపోయి 15రోజులు గడిచినా నేటికీ మరమ్మతులు చేయించలేదని ఆరోపించారు. పాలేరు వాగు నుంచి ఊట బావి తవ్వించి మంచినీటి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో మహిళలు కావటి మల్లమ్మ, కొంపెల్లి లింగమ్మ, గాడుదుల సుజాత, తండా లక్ష్మి, ఉప్పల సరోజన, మట్టపెల్లి కొమరమ్మ, జ్యోతి, ఉప్పల వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
#
Tags