రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి
Published on Sun, 07/31/2016 - 22:53
- ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి
- వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం
ఆమనగల్లు: విజయవాడలో అర్థరాత్రి తొలగించిన దివంగత మహానేత, ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి కాంస్య విగ్రహాన్ని అక్కడే పునప్రతిష్టించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడలో మహానేత వైఎస్ విగ్రహం తొలగింపునకు నిరసనగా ఆమనగల్లులో ఆదివారం వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం చల్లా వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. విజయవాడలో మహానేత వైఎస్ కాంస్య విగ్రహాన్ని అధికార బలంతో అర్ధరాత్రి తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అన్ని అనుమతులతో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసినప్పటికి అకారణంగా తొలగించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తొలగించిన చోటే వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. విజయవాడలో వైఎస్ విగ్రహ ఏర్పాటు కోసం జరిగే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిల శ్రీనివాస్గౌడ్, వైఎస్సార్సీపీ నాయకులు ఆనంద్నాయక్, బాలస్వామి, రహీం, కాంగ్రెస్ నాయకులు, ఖాదర్, ఖలీల్, కృష్ణానాయక్, ధనుంజయ, పులికంటి మైసయ్య, రామలింగం, కండె సాయి, అలీం, రాఘవేందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.
#
Tags