amp pages | Sakshi

మోడీ మాస్టారు!

Published on Sat, 09/06/2014 - 23:09

 సంపాదకీయం

సాధారణంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజున చాలా పాఠశాలల్లో ‘పిల్లల పిరీయడ్’ ఉంటుంది. పిల్లలే టీచర్ల అవతారమెత్తి తరగతుల్లో ‘పెత్తనం’ చేస్తారు. రోజూ తమతో వారు ఎలా వేగుతున్నారో అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. కానీ, ఈసారి ఆ బాధ్యతను ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్నారు. న్యూఢిల్లీ మానెక్ షా ఆడిటోరియంలో వేయిమంది విద్యార్థులను... దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్‌ను వీక్షిస్తున్న మరిన్ని వేలమందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వాళ్లడిగిన ప్రశ్నలకు, సందేహాలకు వారి మాటల్లోనే జవాబులిచ్చారు. ఈ క్రమంలో తానూ చిన్నపిల్లాడిగా మారారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. చతురోక్తులతో వారిని అలరించారు. తనలో ఒక మంచి బోధకుడు, ఉపాధ్యాయుడు ఉన్నారని రుజువుచేశారు.

ఈ కార్యక్రమమంతా పూర్తయ్యాక అసలిది ఇంత వివాదాస్పదం ఎందుకయిందని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, ఇందుకు నిందించవలసింది ముందుగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖనే! ఆ శాఖనుంచి వివిధ విద్యాసంస్థలకు వెళ్లిన ఉత్తర్వులు, వాటి ఆధారంగా కొన్ని విద్యా సంస్థలు చేసిన హడావుడి అనవసర వివాదానికి అంకురార్పణ చేశాయి. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌కు పాఠశాలలన్నీ తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ఆ కార్యక్రమం పూర్తయ్యాక అందులో ఎన్ని పాఠశాలలు పాల్గొన్నాయో, ఎందరు విద్యార్థులు వీక్షించారో తాము సమీక్షిస్తామని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో ఉన్నది. ఈ ఉత్తర్వులు అందుకున్నాక కొన్ని పాఠశాలలు ‘విద్యార్థులందరికీ హాజరు తప్పనిసరి. గైర్హాజరైనవారిపై కఠిన చర్యలుంటాయి’ అంటూ సర్క్యులర్‌లు జారీచేశాయి. కొందరు గడుసు ప్రిన్సిపాళ్లు సోమవారంనుంచి జరగబోయే పరీక్షల్లో ‘మోడీ ప్రశ్నలు’, వాటికి మార్కులు ఉంటాయని హెచ్చరించారు. ఇంతా జరిగాక ఇక వివాదం రేకెత్తకుండా ఎందుకుంటుంది? నరేంద్ర మోడీ సహజంగానే వాక్పటిమ ఉన్నవారు. వినేవారిని మంత్రముగ్ధుల్ని చేయగల సత్తా ఆయనకుంది. ఆ సంగతి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అందరికీ తెలిసింది. పైగా, మధ్యతరగతి వర్గంలో మోడీపై ఇప్పుడు ప్రత్యేక అభిమానం ఉన్నది. ఆయన ప్రసంగించబోయేది పిల్లలనుద్దేశించే గనుక దాన్ని తమ పిల్లలంతా వినాలని వారు సహజంగానే కోరుకుంటారు. అటువంటప్పుడు హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ బెదిరింపు లాంటి ఉత్తర్వులు పంపాల్సిన అవసరమేముంటుంది?

నరేంద్ర మోడీ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. ఆయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) నేపథ్యం ఉన్నది. అందులో పనిచేసిన అనుభవంవల్ల ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో, అందుకు ఎలా మాట్లాడాలో తెలిసివున్న వ్యక్తి. ఆయన ప్రసంగాలు ఆశువుగా మాట్లాడినట్టు ఉంటాయి తప్ప అందుకోసం ప్రత్యేకించి తర్ఫీదై వచ్చినట్టు ఉండవు. అందువల్లే పిల్లలతో ఆయన ఇట్టే కలిసిపోయారు. నైతిక విలువలు, జాతి నిర్మాణం వంటి గంభీరమైన అంశాలు చెప్పడంతోపాటు వారి స్థాయికి వెళ్లి ఎన్నో విషయాలపై వారిలో ఆలోచన రేకెత్తించారు. బాలికా విద్య గురించి అయినా, విద్యుత్ పొదుపు గురించి అయినా, పర్యావరణం గురించి అయినా ఆయన పిల్లలకు అర్ధమయ్యే భాషలో మాట్లాడారు. ఎప్పుడూ పుస్తకాలకూ, టీవీలకూ, కంప్యూటర్లకూ అతుక్కుపోవద్దని...ఆరుబయటకెళ్లి ఆడుకొని చెమట చిందించాలని సూచించారు. దీపాలు తీసి పున్నమి రాత్రులను ఆస్వాదించమన్నారు. పిల్లలు అడిగిన ప్రశ్నల్లో ఎక్కువ భాగం వారి టీచర్లో, తల్లిదండ్రులో ఎంపికచేసినవి అయివుంటాయని వేరే చెప్పనవసరం లేదు. కానీ, చివర్లో ‘నాలో మీకేం నచ్చింద’ని మోడీ వేసిన ప్రశ్నకు వారిచ్చిన జవాబు మాత్రం అచ్చంగా వారి సొంతం. తమకు మోడీ చిన్ననాటి అల్లరే నచ్చిందని వారంతా ముక్తకంఠంతో బదులిచ్చారు. పిల్లలు కాదు... పిడుగులనేది అందుకే!

 మోడీ తన సంభాషణలో ఉపాధ్యాయుల గురించి కూడా మాట్లాడారు. బోధనలో సాంకేతిక సౌకర్యాలు వినియోగించుకోమని వారికి సలహా ఇచ్చారు. దేశంలో విద్యారంగం ప్రాముఖ్యత పెరుగుతుంటే ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్నదని చెప్పారు. ఆయనన్నది నిజమే. విద్యారంగం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నది. మోడీ కార్యక్రమాన్ని కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు రేడియోల ద్వారా మాత్రమే వినడం ఇందుకు రుజువు. విద్యాహక్కు చట్టం వచ్చి నాలుగేళ్లు దాటుతున్నా ఈ రంగం మెరుగుపడలేదు. నిరుడు గుజరాత్, యూపీ, బీహార్‌లలో అడ్‌హాక్ టీచర్ల నియామకంపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ప్రభుత్వాల తీరును సుప్రీంకోర్టు దుయ్యబట్టింది. తగిన అర్హతలున్నాయనుకుంటే నేరుగా ఉపాధ్యాయులుగానే తీసుకోవచ్చును కదా...‘శిక్షా సహాయక్’ల పేరుతో నియమించి అరకొర వేతనాలు ఎందుకిస్తున్నారని నిలదీసింది. అర్ధాకలితో, భవిష్యత్తుపై బెంగతో పనిచేసే టీచర్లనుంచి మెరుగైన విద్యాబోధన ఆశించడం ఎలా సాధ్యమో ప్రభుత్వాలు ఆలోచించాలి. వచ్చే జీతం చాలక ఉపాధ్యాయుల్లో కొందరు రియల్‌ఎస్టేట్, చిట్‌ఫండ్ వ్యాపారాలవంటివి చేస్తున్నారని ఆమధ్య ఒక నివేదిక తెలిపింది. ఎన్నో పాఠశాలలు తగిన భవనాలు లేక, ఉన్నా అవి శిథిలావస్థకు చేరుకుని చెట్లకింద కాలక్షేపం చేస్తున్నాయి. ఇక నల్లబల్ల, బెంచీలు వంటివి లేని పాఠశాలలు ఎన్నో! ఎందుకనిపించిందోగానీ... బాలల దినోత్సవం (నవంబర్ 14) నాడు కాకుండా ఉపాధ్యాయ దినోత్సవం రోజున పిల్లలతో మాట్లాడాలని నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నారు. బాగుంది. అయితే, ఈ విద్యారంగం సమస్యలన్నిటిపైనా ప్రత్యేక దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరలో వాటిని పరిష్కరించగలిగితే ఆ పిల్లల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.
 

 
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)