amp pages | Sakshi

షేక్షావలి కుటుంబాన్ని ఆదుకోని ప్రభుత్వం

Published on Tue, 12/04/2018 - 05:58

ఆరుగాలం వ్యవసాయాన్ని నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న రైతు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుని చనిపోయి రెండున్నరేళ్లు గడచినా రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతు కుటుంబాలను ఆదుకోకపోవడంతో నిరంతరం వారు ఆవేదనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కేంద్రమైన మర్రిస్వామి మఠం కాలనీకి చెందిన హుసేన్‌ వలి కుమారుడు షేక్షావలి(45) రైతు అప్పుల పాలై 2016 జనవరి 19న తన ఇంటì లోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి పేరున మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

గత నాలుగేళ్లుగా పంటలు సరిగ్గా పండటం లేదు. పెట్టిన పెట్టుబడి చేతికి అందకపోవడంతో షేక్షావలి ఆవేదనకు లోనయ్యారు. స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ. 80 వేలు, సహకార పరపతి సంఘంలో రూ. 1.40 లక్షలు, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రూ. 2 లక్షలు అప్పు చేశారు. రైతుల రుణాలు మాఫీ చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ షేక్షావలి రుణాలు మాఫీ కాలేదు. వ్యవసాయ బోర్లు తవ్వించారు. అప్పులు చేసి తవ్వించిన బోర్లలో భూగర్భజలాలు ఇంకిపోయాయి. అప్పులు మిగిలాయి. దీంతో వర్షాధారంపైనే పత్తి, వేరుశనగ తదితర పంటలను సాగుచేస్తూ వచ్చారు.

షేక్షావలి తల్లి హుసేన్‌బీ, భార్య నహౌంబీ, కుమారుడు రహిమాన్, కుమార్తెలు ముంతాజ్, ఆఫ్రీన్‌ ఉన్నారు. ఆఫ్రీన్‌కు వివాహం అయ్యింది. ముంతాజ్‌ ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నది. కుమార్‌ ర హిమాన్‌ వెల్డింగ్‌ షాపులో దినసరి కూలిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం షేక్షావలి కుటుంబం అప్పుల భారంతోపాటు భార్య నహౌంబీ, తల్లి హుసేన్‌ బీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. కొడుకు రహిమాన్‌ దిన కూలిగా పనిచేసి కుటుంబాన్ని గట్టెక్కిస్తున్నాడు. పెద్ద దిక్కును కోల్పోయిన వారి కుటుంబం ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయింది. అప్పటి ఆర్డీఓ,తహíసీల్దార్‌ విచారణ చేశారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా అందక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని షేక్షావలి తల్లి, భార్య ‘సాక్షి’ ఎదుట వాపోయారు.
– యు. చంద్రబాబు, సాక్షి, ఆలూరు, కర్నూలు జిల్లా
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)