మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి
Published on Tue, 07/10/2018 - 19:51
కవిత్వానికి చమత్కారాన్ని జోడించి చక్కలిగింతలు పెట్టిన కవి ఆరుద్ర. ఇంకా చెప్పాలంటే చమత్కారాన్ని కూడా కవిత్వంగా మలవగలిగిన కవి ఆరుద్ర. పద ప్రయోగాల్లోనూ, వ్యక్తీకరణల్లోనూ ఆరుద్ర మార్కు తెలుస్తుంది. ‘మహాబలుడు’ చిత్రం కోసం ఆరుద్ర
‘ఓ ఓ విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయములో కలువలేమా’ పాట రాశారు. అందులోని ఒక చరణంలో–
‘వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి
నా కన్నులనే గిన్నెలతో
తాగమన్నవి’ అంటాడు నాయకుడు. దానికి బదులుగా–
‘వొలికే మధువు కొసరే వధువు
రెండూ నీవే’ అని బదులిస్తుంది నాయిక.
1969లో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం ఎస్.పి.కోదండపాణి. సుశీల, బాలసుబ్రహ్మణ్యం గాయనీ గాయకులు. దర్శకుడు సినిమాటోగ్రాఫర్ రవికాంత్ నగాయిచ్. వాణిశ్రీ,కృష్ణ నటీనటులు.
#
Tags