amp pages | Sakshi

మంచి కథను గుర్తించనీయని ఉద్దేశ భ్రమ

Published on Mon, 12/16/2019 - 00:07

అనుశీలనం, నవలాశిల్పం, కథాశిల్పం, విమర్శాశిల్పం లాంటి పుస్తకాలతో తెలుగు సాహిత్య విమర్శకు, ముఖ్యంగా కథాసాహిత్యానికి మంచి భూమికను ఏర్పరిచారు వల్లంపాటి వెంకటసుబ్బయ్య. 1995లో వచ్చిన ఆయన కథాశిల్పంకు 1999లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆ పుస్తకంలో మంచి కథను అంచనా గట్టడానికి భావజాలం అడ్డుకాకూడదనీ, ఉద్దేశం మంచిదైనంత మాత్రాన రచన మంచిదైపోదనీ ఇలా వ్యాఖ్యానించారు:
తటస్థ చరిత్రలాగే తటస్థ సాహిత్యం కూడా ఉండదు. చరిత్రను చదవటానికి ముందుగా చరిత్రకారుణ్ణి చదవాలని ఇ.హెచ్‌.కార్‌ సూచించాడు. అలాగే సాహిత్యం చదవటానికి ముందు దాన్ని సృష్టించిన సాహిత్యకారుణ్ణి చదవటం మంచిది. సాహిత్యం నుంచి భావజాలాన్నీ– మరీ ముఖ్యంగా రచయిత భావజాలాన్నీ– దూరం చేసి పరిశీలించటం మంచిపద్ధతి కాదు. కానీ రచయిత భావజాలానికీ, ఉద్దేశానికీ అతి ప్రాముఖ్యత ఇచ్చి, రచన విలువను నిర్ణయించటం కూడా తప్పు పద్ధతే. అంటే ‘‘రచయిత ఈ ఉద్దేశంతో రాశాడు, ఉద్దేశం గొప్పది, కాబట్టి రచన గూడా గొప్పది,’’ అన్న సమీకరణం పొరపాటు. దీన్ని నవ విమర్శకులు ‘‘ఉద్దేశ భ్రమ’’ (ఇంటెన్షనల్‌ ఫాలసీ) అన్నారు. రచయిత ఉద్దేశం ఎంత గొప్పదైనా కావచ్చు. అది రచనలో కళాత్మకంగా వ్యక్తం కానంతవరకూ దానికి విలువ లేదు. కథావస్తువు గమ్యమే ఉద్దేశం. ఉద్దేశాన్ని కళగా మార్చే పరుసవేది శిల్పం లేదా రూపం. ఈనాడు తెలుగు సాహిత్య విమర్శలో ‘‘ఉద్దేశ భ్రమ’’ చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. అందుచేత విమర్శకుడు ఆ భ్రమలో పడకుండా ఉండాలంటే కథాక్రమం, కథాంశం, ఉద్దేశం కళగా మారే క్రమాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

మీకు తెలుసా?
‘కవిత్వం ఒక స్వప్నక్రియ. కవిత్వం ఒక రహస్య క్రీడ. అంతా ఒక ‘చిత్కళ’. నేను వ్రాసిన పద్యాలన్నీ చిత్తుప్రతులే. ఎప్పుడో రాసిన పద్యాన్ని గూర్చి ఇప్పటికీ ఆలోచిస్తూవుంటాను. అవసరమైతే మార్పులు కూడా’ అన్న కవి అజంతా అసలు పేరు పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి. తన జీవితకాలంలో సుమారు 40 కవితలు మాత్రమే రాసిన ఆయన కవితాసంపుటి ‘స్వప్నలిపి’. దీనికి 1997లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది.
వల్లంపాటి వెంకటసుబ్బయ్య 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)