amp pages | Sakshi

పదవులు తప్ప ఏ త్యాగానికైనా సిద్ధమట!

Published on Sat, 09/14/2013 - 20:27

రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తరువాత కేంద్రంలోని సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపిలు  సమావేశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం గురించి తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతూనే ఉన్నారు. రాష్ట్రం విభజిస్తున్నారన్న సూచనలు రాగానే రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే రాజీనామాలు చేశారు. ఆ తరువాత ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయ్మ, ఎంపి రాజమోహన రెడ్డి కూడా రాజీనామాలు చేశారు. ఉద్యమానికి ఊతంగా నిలిచారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఒక పక్క  చర్చలతో కాలం వెళ్లదీస్తుంటే, సీమాంధ్రలో మాత్రం రాజకీయ నేతలతో సంబంధంలేకుండా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు, మంత్రులు రాజీనామా చేయాలంటూ  సమైక్య రాష్ట్ర ఉద్యమకారులు  పదే పదే డిమాండ్‌ చేస్తున్నారు. వినూత్న రీతుల్లో ప్రతి రోజూ నిరసనలు తెలుపుతూ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచుతున్నారు. వారి ఇళ్లపై దాడులు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో  భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకునేందుకు సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు  హైదరాబాద్‌ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని క్లబ్‌ హౌస్లో ఈరోజు సమావేశమయ్యారు.    ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, చిరంజీవి, పురందేశ్వరి, జే.డి.శీలం,  కోట్ల సూర్యప్రకాశ రెడ్డి,  ఎంపీలు లగడపాటి రాజగోపాల్‌, కెవిపి రామచంద్రరావు,  మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  కనుమూరి బాపిరాజు, అనంత వెంకట్రామిరెడ్డి,  సాయిప్రతాప్‌, ఎస్‌.పి.వై.రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ హాజరయ్యారు. సమావేశంలో పాల్గొనడం ఇష్టంలేక మినిస్టర్స్ క్వార్టర్స్లోనే ఉన్న బొత్స ఝాన్సీ బయటకు వెళ్లారు. అయితే ఆ తరువాత సమావేశం ముగియడానికి పది నిమిషాలు ముందు తిరిగి వచ్చారు. మంత్రులు  కిశోర్‌ చంద్రదేవ్‌, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, ఎంపీలు  రాయపాటి సాంబశివరావు,  చింతా మోహన్‌, హర్షకుమార్‌, సబ్బం హరి,  రత్నాబాయి,  నేదురుమల్లి జనార్థన్‌ రెడ్డి,టి. సుబ్బరామిరెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. సమావేశంలో యథావిధిగా దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. చివరకు సమైక్య రాష్ట్రం కోసం ఏ త్యాగాలు చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. అయితే పదవులకు మాత్రం రాజీనామాలు చేసేదిలేదని స్పష్టం చేశారు.

సమావేశం అనంతరం వారు చెప్పిన విషయాల సారాంశం: మాకు పార్టీ కంటే ప్రజలే ముఖ్యం. ఈ విషయం అధిష్టానానికి చెప్పదలుచుకున్నాం. మరోసారి మేం అధిష్టానం పెద్దలను కలుస్తాం. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని కోరతాం.  మేం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. సమైక్య రాష్ట్ర ఉద్యమ తీవ్రతతో  విభజనపై కేంద్రం పునరాలోచనలో పడింది. సీమాంధ్ర ప్రజల అభీష్టం మేరకే  కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఇరుప్రాంతాల్లోనూ ఆంటోని కమిటీ పర్యటించి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తాం. కేసిఆర్‌ చనిపోతాడన్న భయంతో 2009లో కేంద్రం విభజన ప్రకటన చేసింది.  కేసీఆర్ ఆడింది నాటకమని డిసెంబర్‌ 9 ప్రకటనకు ముందే మేం చెప్పాం. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండవు.  జూలై 30 ప్రకటనతో మరిన్ని సమస్యలు వస్తాయని అధిష్ఠానానికి ముక్తకంఠంతో ముందే చెప్పాం.  2009లాగే 2013లోనూ కేంద్రం నిర్ణయం వెనక్కువెళ్తుంది.

సమావేశంలో వారు అనేక విషయాలు చర్చించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అధిష్టానాన్ని కలవాలని తీర్మానించారు. చర్చించిన అన్ని విషయాలలో ఏకాభిప్రాయానికి వచ్చారు. కానీ రాజీనామాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.   కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎంపీల రాజీనామాను సమైక్యవాదులు డిమాండ్‌ చేస్తున్నారు కదా అన్న విలేకరుల ప్రశ్నకు  వారు  సమాధానాన్ని దాటవేశారు. పదవులకు రాజీనామాలు చేయడం తప్ప వారు ఏ త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అదీ వారి చిత్తశుద్ధి.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)