amp pages | Sakshi

ప్రతికూల ప్రచారం తప్ప గత్యంతరం లేదా?

Published on Sun, 12/10/2017 - 03:30

వార్తా ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అన్ని, లేదా దాదాపు అన్ని వార్తా కథనాలూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మీడియా మద్దతుతో బీజేపీ ప్రచారంలో ప్రవేశపెట్టినవేనని కనబడుతూనే ఉంది. బీజేపీ సాగిస్తున్నది దూషణలు, భయాలతో కూడిన ప్రతికూల ప్రచారం. 2014లో వలే సుపరిపాలన, అచ్చేదిన్‌ నినాదాలతో సానుకూల ప్రచారాన్ని చే యాలన్న కోరికే దానికి లేకపోవడం నేడు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న విషయం. ఇది దురదృష్టకరం. ఉపఖండంలో రాజకీయాలు సాగే పద్ధతి కూడా ఇదే.

మణిశంకర్‌ అయ్యర్‌ ఏదో అన్నంత మాత్రాన అదో సమస్యగా, గుజరాత్‌ ఎన్ని కల సమస్యగా మారుతుందని ఎవరు అనుకుంటారు? నేనైతే కచ్చితంగా అనుకో లేదు. గజరాతీలు తమకేమీ సంబంధంలేనిదిగా భావించే ఈ అంశం గుజరాత్‌ ఎన్నికల్లో చెప్పుకోదగినంత పెద్ద సమస్య అవుతుందని నేను అనుకోవడం లేదు కూడా. అయ్యర్‌ వాడిన అప్రతిష్టాకరమైన పదం గురించి నేను గుజరాతీ నిఘం టువును శోధించాను. ‘నీచ్‌’కు గుజరాతీ అనువాదం ‘దుష్ట్‌’. ఇంగ్లిష్‌ అనువాదాలు ‘వంచనాత్మక’, ‘దుష్ట’, ‘తుచ్ఛ’ అనేవి. అయ్యర్‌ ఆ పదాన్ని వాడి ఉండాల్సిందా? లేదు. రాజకీయ చర్చ, అసలు ఏ చర్చయినాగానీ నాగరికమైనదిగా ఉండి తీరాలి. అయితే ఇంతకూ ఆ మాటకూ, కులానికి ఏమైనా సంబంధం ఉన్నదా? లేదు.

ఇక రెండవది మోదీ కులానికి సంబంధించిన సమస్య. ప్రధాని, ఘాంచి అనే బాగానే అభివృద్ధిచెందిన కులానికి చెందినవారు. వాళ్లు కిరాణా దుకాణాలు నడ పడం, నూనె తియ్యడం చేస్తారు. దుకాణాల్లో ధాన్యం (టీ కూడా) అమ్ముతారు. మోదీ అంటేనే, గాంధీలాగా పరిసర ప్రాంతంలోని కిరాణా దుకాణదారు అని అర్థం.

గుజరాతీలు ఘాంచీలను వెనుకబడిన కులంగా చూడరు. 1999లో వాజ్‌ పేయి హయాంలోనే అది వెనుకబడిన కులంగా లేదా ఓబీసీగా మారింది. కాబట్టి గుజరాతీలలో చాలా మందికి సంబంధించి ‘నీచ్‌’ అంటే వెంటనే ప్రధాని కులాన్ని కించపరిచే మాటని అనిపించదు.

ఈ కారణాల వల్లనే నేను దీన్ని ఉద్దేశపూర్వకంగానే పెద్దదిగా చేశారని, ప్రత్యే కించి ఎన్నికల ప్రచారంలో ప్రభావశీలమైన ఆయుధం కాగలదని భావించి అలా చేశారని అనుకుంటున్నాను. బీజేపీ విజయానికి (బీజేపీ గెలుస్తుందని నా అంచనా. గత వారం కాలమ్‌లో కూడా అదే రాశాను) నిర్దిష్టంగా దారితీసిన అంశం ఏదో, మీడియా సృష్టించిన గాలి కబుర్లు ఏవో కాలమే తేల్చాలి.

సోమనాథ ఆలయం రిజిస్టర్‌లో రాహుల్‌ గాంధీ సంతకం చేయడం వ్యవ హారం కాంగ్రెస్‌కు నష్టం కలిగించే అంశం అవుతుందేమోనని అనుకున్నా. కానీ ఆ తర్వాతి వార్తలను బట్టి చూస్తే అలాంటిదేమీ జరగలేదని తేలింది. రాహుల్‌ తనను హిందూయేతరునిగా నమోదు చేయించుకోవాలనుకుంటే గుజరాతీలు తప్పక ఆస క్తిని చూపేవారే. కానీ ఆయన ఆ పని చేయలేదు. అయితే ఆ కథనం ఇప్పుడు గతించిన చరిత్రగా మారిపోయింది. మీడియా ఆసక్తి మరో వైపునకు మరలింది. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపట్టడాన్ని మణిశంకర్‌ అయ్యర్‌ షాజహాన్, ఔరంగజేబులు అధికారంలోకి రావడంతో పోల్చారనే అంశం ముందుకు వచ్చింది. ఆ విషయంపై వ్యాఖ్యానించిన వారిలో చాలా మంది ఆయన చెప్పినదాన్ని పూర్తిగా ఉల్లేఖించలేదనేది స్పష్టమే. అలా వ్యాఖ్యానించిన వారిలో నేనూ ఉన్నాను. రాహుల్‌ గాంధీ, ఔరంగజేబులను ఒకచోట చేర్చి ఏమి మాట్లాడినా దాన్ని మోదీ ఉపయోగించుకుంటారని అయ్యర్‌కు తెలిసి ఉండా ల్సింది. అలాగే మోదీ వాడుకున్నారు కూడా. ఇది ఓటర్లును ఎంతగా ప్రభావితం చేసే అంశం? ఇలాంటి ఏ ఒక్క విషయంపైనో ఆధారపడి ప్రజలు ఓటు చేస్తారని అనుకోను. కానీ, రెండు దశాబ్దాలు తాము పాలించిన రాష్ట్రంలో బీజేపీ తమ ప్రభుత్వం పనితీరును గురించి గాక, కాంగ్రెస్‌ గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించింది.  

అంతకు ముందు బీజేపీ, అహ్మద్‌పటేల్‌ ఒక ఆసుపత్రికి ట్రస్టీగా ఉన్నారని వెల్లడించింది. అలాగే ఉగ్రవాద ఆరోపణలున్న ఒక వ్యక్తి అహ్మద్‌ పటేల్‌ వద్ద ఉద్యోగిగానో లేక మాజీ ఉద్యోగిగానో ఉన్నారని ఆరోపించారు. పటేల్‌కు, ఆ ఆరోపణలకు గురైన వ్యక్తికి ఎలాంటి సంబంధమూ లేదు. కాబట్టి అదో బూటకపు కథనం. ఉగ్రవాదం విషయంలో కాంగ్రెస్‌ది మెతక వైఖరి అని చూపడం ద్వారా సాధారణంగా బీజేపీకి లబ్ధి కలుగుతుంది. కాబట్టే ఆ కథనాన్ని ముందుకు తెచ్చారు. కానీ చరిత్ర, గణాంకాలు అందుకు విరుద్ధమైన ఫలితాలనే చూపు తున్నాయి.

ఇక ఆ తర్వాత, కొద్ది రోజుల క్రితమే కపిల్‌ సిబల్‌ కథనం ముందుకు వచ్చింది. కాంగ్రెస్‌ నేత, న్యాయవాది అయిన ఆయన 2019 ఎన్నికల వరకు బాబ్రీ మసీదు కేసు తీర్పును వెలువరించరాదని సుప్రీం కోర్టును కోరారు. ఇలా పూర్తిగా సిద్ధం చేసి ఇచ్చిన సమాచారంతో మరో దఫా వార్తల్లో చక్కెర్లు కొట్టి వచ్చే అవ కాశాన్ని ఇది మోదీకి కల్పించింది. అయోధ్య వివాదం బీజేపీని జాతీయపార్టీని చేసింది. అయితే అదిప్పుడు రాజకీయంగా కాలం చెల్లిన అంశం. అయినా దాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే ప్రముఖమైన దాన్ని చేశారు.

మణిశంకర్‌ అయ్యర్‌ ఇప్పటికే తనకు నోరు మూసుకుని ఉండటం చేతకాదని నిరూపించుకున్నారు. తనను చంపడానికి ‘సుపారీ’ తీసుకోవాలని అయ్యర్‌ పాకిస్తానీలను కోరారని మోదీ మరో ఆరోపణ చేశారు. అయితే అది నిజం కాదను కోండి. ప్రధాని దాన్ని నిజమని విశ్వసిస్తూ ఉండాలి. అలా జరిగితే అది ఆందో ళనకరమైన విషయమే. లేకపోతే అది ఎన్నికల్లో ఉపయోగపడే అంశమని అను కోవడమైనా జరిగి ఉండాలి. ఇలా జరిగినా గానీ అది ఆందోళన చెందవలసిన విషయమే. వార్తా ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అన్ని, లేదా దాదాపు అన్ని వార్తా కథనాలూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ మీడియా మద్దతుతో ప్రవేశ పెట్టినవేనని కనబడుతూనే ఉంది. బీజేపీ సాగిస్తున్నది దూషణలు, భయాలతో కూడిన ప్రతికూల ప్రచారం. 2014లో సుపరిపాలన, అచ్చేదిన్‌ నినాదాలతో చేప ట్టిన సానుకూల ప్రచారాన్ని చేయాలనే కోరికే బీజేపీకి నేడు లేకపోవడం కొట్టవచ్చి నట్టు కనిపిస్తున్న విషయం.

ఇది దురదృష్టకరం. ఉపఖండంలో రాజకీయాలు సాగే పద్ధతి కూడా ఇదే. ఈ ఎత్తుగడలను ఉపయోగించాలనుకున్న ప్రతిచోటా బీజేపీ వాటిని ప్రయోగించ వచ్చు. మీడియా ముందుకు నెట్టాలని భావించే విధంగా దాన్ని ఆకట్టుకునే అంశా లను కాంగ్రెస్‌ పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో చేస్తున్నట్టుగా ఉద్దేశ పూర్వక మైన తప్పులు చేయకుండా చూసుకోవాల్సినది కాంగ్రెస్‌ పార్టీయే.


- ఆకార్‌ పటేల్‌

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)