amp pages | Sakshi

ఈసీని బద్నాం చేస్తే లాభమేంటి?

Published on Wed, 04/17/2019 - 01:54

ఏపీ శాసనసభ, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించిన వ్యవహారంపై అధికారపక్షం గగ్గోలు పెట్టడంతో ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయత ప్రమాదంలో పడినట్లయింది. ఎన్నికల కమిషన్‌ తీరు వంకపెట్టలేనిదేమీ కాదు. అలా అని దాన్ని ఊరకే నిందిస్తూ కూర్చున్నా ఫలితం లేదు. నిష్పక్షపాతంగా దాని పనితీరు మదిం పుచేసి లోపాలను, బలహీనతల్ని  అధిగమించేలా, స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసేలా ఎలా తీర్చిదిద్దాలో రాజకీయపక్షాలన్నీ ఆలోచించాలి. దాని పని తీరును ఎత్తిచూపే రాజకీయ పార్టీలు, తాము అధికారంలోకి వస్తే ఎలా దాన్ని బలోపేతం చేస్తామో చెప్పాలి. అదేసమయంలో ఆ రాజ్యాంగ సంస్థని అధికార పక్షం పంజరంలో చిలుకగా మార్చినట్టు చెప్తున్న ప్రతిపక్షాలు, దానిని బయట నుండి పుల్లలతో హింసించి ప్రయోజనం లేదు. లక్షలాది ఓట్లు గల్లంతు కావడం ఆ సంస్థ పనితీరుకు శోభనివ్వదు. సరికదా బాధ్యతారాహిత్యంగా అనుకోవాల్సి వస్తుంది. ఈవీఎంల పనితీరుపై సందేహం వ్యక్తపరిచినపుడు, ఆ సందేహాన్ని ప్రాక్టికల్‌గా నివృత్తి చెయ్యాలి తప్ప, అడిగిన వారి డిగ్రీలు, అర్హతలు గురించి మాట్లాడకూడదు.

ఇక ప్రతిపక్షాలు 50శాతం వీవీప్యాట్‌లు లెక్కించాలని కోరడంలో లాజిక్‌ తెలియడం లేదు. ఈవీఎంల నిక్కచ్చితనంపై సందేహం ఉంటే తేల్చుకోడానికి అంత స్థాయిలో శాం పిల్‌ అక్కరలేదు. రాండమ్‌గా కొంత శాతం సరిపోతుంది. లేదూ, వాటిని ట్యాంపర్‌ చేసి ఫలితాల్ని ప్రభావితం చేశారేమో అనుకున్నా అప్పుడు 50 శాతం లెక్కించినా ప్రయోజనం లేదు. 99శాతం లెక్కించినా మిగిలిన ఒక్క శాతంలో గడబిడ జరిగి ఫలితాలు మారొచ్చు కదా. కాబట్టి విశ్వసనీయత అన్నది అయితే సంపూర్ణం లేదా సున్నా తప్ప కొంచెం కొంచెం ఉండదు. 50శాతం లెక్కింపు తో ప్రయాస తప్ప, విశ్వసనీయతలో ప్రగతి ఏముం టుంది? అయితే అందరూ ఒప్పుకోవాల్సింది ఒకటి. ఎన్నికల కమిషన్‌కి స్వయం ప్రతిపత్తి ఉండాలి. స్వతంత్ర నిర్ణయాలు అమలుచేసే శక్తి ఉండాలి. సిబ్బంది ఉండాలి. అలా చెయ్యాలంటే అవసరమైన రాజ్యాంగ సవరణలకు ఒప్పుకునే పార్టీలుండాలి. రేపు అధికా రంలోకి రాబోయే వారికి ఆ చిత్తశుద్ధి ఉండాలి. ఎన్నికలు ముగిశాక, తమకు ఇబ్బంది కలిగించే సంస్కరణలకు వత్తాసు పలికేలా పార్టీలు ఆలోచిస్తా యా అన్నది సందేహం. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఆ తరహా సంస్కరణలు తప్పనిసరి అవసరం.
-డా.డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)